2019 ఎన్నికల ముందు జగన్ హత్య రాజకీయాలు బాగానే పండాయి. ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి హోదాలో అసత్యాలను బాగానే వండి వార్చారు. కక్ష్యను ప్రేరేపించి నాగుపాము వలె విపక్షలపై బుసలు కొట్టారు. అంతటితో ఆగకుండా ఎన్నికలు సమీపిస్తున్న వేళ .. ప్రస్తుతం తన సైకోయిజాన్ని చల్లార్చుకునేందకు కొత్త ఎత్తులకు.., నీచ రాజకీయాలకు తెరతీశారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ .. తనదైన ఫ్యాక్షన్ రాజకీయాలతో ఏపీని సర్వత్ర నాశనం చేశారన్నది విపక్షాల వాదన. ఆ వాదనలకు బలం చేకూర్చేలా 2021 లో నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును తిరగతోడి.. ఏ 37 గా ఉన్న చంద్రబాబును ఏ1 గా మార్చి.. అరెస్ట్ చేసి .. రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపారు. ఆ తరువాత టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా అరెస్ట్ చేసేందుకు పథక రచన చేస్తున్నారు. దీంతో ఈ కేసులు లోకేష్ న్యాయస్థానం మెట్లెక్కాల్సిన పరిస్ధితి. స్కిల్ కేసులో ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయ్యి 24 రోజులు కావస్తోంది. ఎప్పుడు బయటకొస్తాడు తెలియని పరిస్ధితి.
ఈ నేపథ్యంలో సంబంధం లేని కేసులో నారా లోకేష్, మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ అంటూ సీఐడీని పురికొల్పాడు. దీనికి సంబంధించిన నోటీసులను మొన్న ఢిల్లీ వెళ్లి సీఐడీ పోలీసులు స్వయంగా నారా లోకేష్ అందజేయగా.. నారాయణకు వాట్సప్ ద్వారా నోటీసులు అందజేశారు. దీంతో 4న నారాయణ ను సీఐడీ ఎదుట హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. రాజధాని ప్రాంతం చుట్టూ నిర్మించ తలపెట్టిన ఇన్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పులో నారాయణ హస్తం ఉందని సీఐడీ అభియోగం.
అయితే నారాయణ దీనిపై స్పందించారు. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డులో తనకు సంబంధించిన 7 కోట్ల విలువ చేసే భూమి పోయిందని .. ఎంతో నష్టపోయినన్నారు. ప్రజా రాజధాని అభివృద్ధికి కట్టుబడి.. అప్పుడే దాన్ని వదిలేశానన్నారు. అసలు రోడ్డే నిర్మాణమే జరగలేదని.. అందులో ఎటువంటి అవినీతి జరిగిందో అర్థం కావడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం ఎందుకంత హడావుడి చేస్తోందో తెలియడం లేదని వాపోయారు. తనపై లేనిపోని అవినీతి ఆరోపణలతో తనను జైలు పాలు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అందుకు తాను న్యాయ పోరాటం చేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
ఇలా ప్రతిపక్షాలపై కుట్రపూర్వకంగా కక్ష్య సాధిస్తున్నారని జగన్ రెడ్డిపై సోషల్ మీడియా కేంద్రంగా నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు.. నారా లోకేష్ .. నారాయణ.. అచ్చెన్నాయుడు.. కొల్లు రవీంద్ర.. బొండ ఉమా.. దేవినేని ఉమా.. ఇలా మరికొంత మంది సీనియర్లును వివిధ అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేయాలని జగన్ చూస్తున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీరికి బెయిల్ వచ్చి.. భయటకు వచ్చే లోపే ఎన్నికలకు వెళ్లి.. వక్రమార్గంలో అక్రమంగా గెలుపొందాలని పథక రచన చేస్తున్నారని ఇప్పటికే విశ్లేషణలు ఊపందుకున్నాయి.