యంగ్ డైనమైట్ అడివి శేష్ హీరోగా.. శశికిరణ్ తిక్క దర్శకత్వంలో రూపొందిన వార్ బయోపిక్ మేజర్. 26 / 11 ముంబై టెర్రరిస్ట్స్ అటాక్స్.. రిస్కీ ఆపరేషన్ లో ప్రాణా లర్పించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ అనే మలయాళీ జీవిత కథ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 2న మేజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆద్యంతం ఎంతో ఎమోషనల్ గా సాగింది. ప్రస్తుతం మేజర్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మేజర్ గెటప్ లో అడివి శేష్ .. ముంబైలో తాజ్ హోటల్ ను అటాక్ చేసిన టెర్రరిస్టుల్ని మట్టుబెట్టి.. రక్తమోడుతూ.. తన ప్రాణం పోతున్నా కూడా ఇంకా బ్రతికే ఉన్నానంటూ సమాచారం అందించే సీన్ తో టీజర్ ప్రారంభమవుతుంది. దేశాన్ని ప్రేమించడం.. దేశాన్ని కాపాడడం రెండింటినీ దేశభక్తే అంటారని తన తండ్రి పాత్రతో మేజర్ చెప్పడం కనిపిస్తుంది. మరికొన్ని విజువల్స్ తో .. టీజర్ ఎమెషనల్ గా కదిలిస్తుంది. మేజర్ గా అడివి శేష్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. మహేశ్ బాబు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ భాషలతో పాటు మలయాళంలో కూడా మేజర్ సినిమా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా అడివి శేష్ కు ఏ స్థాయిలో పేరు తెచ్చిపెడుతుందో చూడాలి.
Must Read ;- మహేశ్ బ్యానర్ లో క్రేజీ కాంబో?