ఏడునెలలుగా దేశ వ్యాప్తంగా తెరమీద బొమ్మ పడక.. సినీ పరిశ్రమ డల్ గా ఉంది. ప్రేక్షకులకీ బోర్ కొడుతోంది. అన్ లాక్ 5.0 అమల్లోకి వచ్చిన నేపథ్యలో ఈ నెల 15 నుంచి థియేటర్స్ తెరుచుకోవచ్చని, అది కూడా 50 శాతం ఆక్కుపెన్సీ తో మాత్రమేనని పేర్కొంటూ.. కొన్ని మార్గదర్శకాల్ని కూడా విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగా ఆ తేదీలో థియేటర్స్ ను తెరవడానికి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి నుంచీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి.
అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీనికి ససేమిరా అంటున్నాయి. కొన్ని.. తమ డెసిషన్ ను పెండింగ్ లో పెట్టాయి. ఈ నెల 15వ తేదీన థియేటర్స్ ఓపెన్ చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. దాంతో పాటు ఉత్తర ప్రదేశ్, చండీఘర్, హర్యానా , పంజాబ్, కర్నాటక , గుజరాత్ ,పాండిచేరి, వెస్ట్ బెంగాల్ , ఉత్తర ఖండ్, మధ్య ప్రదేశ్ , ఢిల్లీ రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఇక కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలు థియేటర్స్ తెరవడానికి ఒప్పుకోవడం లేదు. ఇక తెలంగాణ, అస్సాం రాష్ట్రాలు తమ నిర్ణయాన్ని ఇంకా తెలుపలేదు.