సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – క్రేజీ హీరోయిన్ రష్మిక కలిసి గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తెలిసిందే. ఆతర్వాత నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం సక్సస్ సాధించకపోయినా.. ఈ జంటకు మంచి పేరు తీసుకువచ్చింది. దీంతో మళ్లీ ఈ జంట ఎప్పుడెప్పుడు కలిసి నటిస్తారా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అయితే.. త్వరలోనే ఈ జంట మరోసారి స్ర్కీన్ పై కనిపించి అలరించనుందని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్ మూవీలో నటిస్తున్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న లైగర్ ముంబాయిలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ భామ అనన్య పాండే నటిస్తుంది. పూరి – ఛార్మి – కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. అయితే.. ఈ సినిమా తర్వాత విజయ్ సుకుమార్ డైరెక్షన్ లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని ఆల్రెడీ ఎనౌన్స్ చేయడం కూడా జరిగింది. సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది.
ఈ సినిమా తర్వాత సుకుమార్ విజయ్ తో సినిమా చేయనున్నారు. ఇందులో కథానాయికగా క్రేజీ హీరోయిన్ రష్మికను ఫైనల్ చేసారని తెలిసింది. కారణం ఏంటంటే.. రష్మిక టాలీవుడ్ లో బిజీ స్టార్ హీరోయిన్. అలాగే బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చింది. విజయ్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందే మూవీ పాన్ ఇండియా మూవీ కావడం.. విజయ్, రష్మిక జంటకు మరింత క్రేజ్ ఉండడంతో రష్మికనే ఫైనల్ చేసారట. అంతే కాకుండా.. పుష్ప మూవీ షూటింగ్ లో రష్మిక అంకితభావం చూసి సుకుమార్, తదుపరి చిత్రానికి ఆమెనే తీసుకోవాలని అయ్యారని తెలిసింది. త్వరలోనే అఫిషియల్ గా ఎనౌన్స చేస్తారేమో చూడాలి.
Must Read ;- ‘లైగర్’ విజయ్ దేవరకొండ తో శివగామి