ఏపీలో సెకండ్ వేవ్ విరుచుకుపడుతోంది. దీంతో భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఒకవైపు కరోనాపై సీఎం జగన్ సమీక్ష జరుపుతుండగా, మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్చనీయాంశంగా మారింది. ఆమె భర్త, వైసీపీ నేత అయిన పరిక్షిత్ రాజుకు కూడా కరోనా సోకింది. ప్రస్తుతం పుష్పవాణి విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. ఒక ఉప ముఖ్యమంత్రి కరోనా బారిన పడటంతో.. ఏపీలో పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా సీఎం జగన్ స్పందించి.. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు.. దెబ్బకి ఆ ఐదుగురు విదేశాలకు జంప్..!
ఏపీ లిక్కర్ స్కామ్లో సిట్ దూకుడు పెంచడంతో ఇందులోని పాత్రధారులు వణికిపోతున్నారు. లిక్కర్...