గత ఏడాది బలవంతంగా ఏకగ్రీవమైన ఎంపీటీసీ, జెడ్పీటీసీలపై సమీక్షిస్తామని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఏకగ్రీవాలపై విచారణ అధికారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు లేదని దాఖలైన పిటిషన్లపై ఏపీ హైకోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఏకగ్రీవాలపై సమీక్షించే అధికారం ఎస్ఈసీకి లేదని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఏకగ్రీవాలైన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఫాం 10 ఇచ్చి ఉంటే ఎస్ఈసీ విచారణ జరపరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫాం 10 ఇవ్వకుండా ఏకగ్రీవాలైన చోట మాత్రం ఆ ఫలితాలు వెల్లడించవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఇవాళ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఈ నెల 23 వరకు అమల్లో ఉంటాయన్నారు.
ఎంపీటీసీ, జడ్పీటీసీలు బలవంతంగా బెదిరింపులకు పాల్పడిన స్థానాల ఏకగ్రీవాలు సమీక్షిస్తామని ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంపై కోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రభావం పడే అవకాశం ఉంది. బలవంతగా ఏకగ్రీవమైన చోట పరిశీలించి మరలా నామినేషన్లు వేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఇప్పటికే ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఫాం 10 ఇచ్చిన చోట ఇక ఎస్ఈసీ విచారణ జరిపే అవకాశం లేదు.
Must Read ;- ఏకగ్రీవాలు విత్ హెల్డ్.. ఫిర్యాదులపై ఎస్ఈసీ విచారణ