నటసింహ నందమూరి బాలకృష్ణ, ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ. సింహా, లెజెండ్ చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేసిన సినిమా కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్టుగానే అఖండ అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద అఖండ ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతూనే ఉంది. అఖండ విడుదలై 25 రోజులైన ఇప్పటికీ మంచి కలెక్షన్స్ సాధిస్తుంది.
నాలుగో వారంలో కూడా అఖండ భారీ కలెక్షన్లు రాబట్టింది. అఖండ భారీ సక్సెస్ సాధించడంతో చిత్రయూనిట్ విజయోత్సవాలు నిర్వహించింది. ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్లో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సహా చిత్రయూనిట్ పాల్గొంది. ఈ ఈవెంట్లో నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి శ్రీను, నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి.. చిత్రయూనిట్ కు సక్సెస్ షీల్డ్ను అందించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో అఖండ చిత్రాన్ని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్లు ఈ సక్సెస్ సెలెబ్రేషన్స్లో పాల్గొన్నారు. 2021లో అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. అఖండ విడుదలైన అన్ని ఏరియాల్లోని డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతకు లాభాలను తెచ్చిపెట్టింది. బాలకృష్ణ కెరీర్లో అత్యధిక గ్రాస్ సాధించిన చిత్రంగా అఖండ నిలిచింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్సీస్లో కూడా రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. అక్కడ వన్ మిలియన్ డాలర్లను కలెక్ట్ చేసి రికార్డులు క్రియేట్ చేసింది.
Must Read ;- బుక్ మై షో టాప్ చిత్రాల జాబితాలో అఖండ