మంత్రి రోజాపై అనుచిత వాఖ్యలు చేసినందుకు గానూ ఆయనపై రెండు కేసులు నమోదు చేశారు. ఆయనకు నోటీసుల ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు.., ఆయన ఇంటి తలుపులు బద్దలు కొట్టుకుని మరి వెళ్లి ఆయన్ను అరెస్ట్ చేసి గుంటూరుకు తరలిస్తున్నారు. 41 ఏ.. 41 బి సెక్షన్ల కింద నోటీసులు ఇచ్చి మరీ ఆయనను అరెస్ట్ చేశారు. అనకాపల్లిలోని ఆయన స్వగ్రామం వెన్నెలపాలెంటో బంగారు సత్యనారయణ మూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
రోజా పై బండారు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర మహిళా కమిషన్ కూడా సీరియస్ గా తీసుకుంది. బండారు అరెస్ట్ అక్రమమని తెలుగుదేశం పార్టీ నేతలు మరో వైపు పెద్దఎత్తున ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీసీ నేతలపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపితే ఇలా అరెస్ట్ లు చేస్తారా..? అంటూ నిలదీస్తున్నారు.
మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా బండారు అరెస్ట్ పై స్పందించారు. బండారు అరెస్ట్ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ .. ఆ పార్టీ మంత్రులు వాడే రోత బూతులపై ఎందుకు కేసులు పెట్టరని ప్రశ్నించారు. వైసీపీ వారు వాడే బూతులకు ఎన్ని కేసులు నమోదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు మాట్లాడవద్దు అని హితవు పలికిన బండారును ఇలా టెర్రరిస్టు మాదిరిగా అరెస్ట్ చేయడం ఏమిటనీ నిలదీశారు. అయితే గుంటూరు వైద్య పరీక్షలు అనంతరం న్యాయమూర్తుల ఎదుట హాజరుపర్చనున్నట్లు తెలుస్తోంది.