ఢిల్లీలో పేలుడు తీవ్ర కలకలం సృష్టించింది. ఇజ్రాయిల్ రాయబార కార్యలయం వద్ద పేలుడు సంభవించింది. కార్యాలయానికి 150 మీటర్ల దూరంలో పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. పేలుడు పదార్థం ఐఈడిగా గుర్తించిన అధికారులు. పేలుడు దాటికి 3 కారు అద్దాలు ధ్వంసమైనట్లు తెలియవచ్చింది. పేలుడు ధాటికి కాసేపు ప్రాంతమంతా గందరగోళం నెలకొంది. ఘటనా స్థలికి చేరుకున్న ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదృష్టవశాత్తూ.. ఎవరికీ దెబ్బలు కానీ, ప్రాణాపాయం కానీ ఉన్నట్లు ఎటువంటి సమాచారం లేదు.
Must Read ;- రైతులపై ఓవైపు కేసులు, సంకెళ్లు.. మరోవైపు ఉక్కుపాదం