బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. నిన్న గాక మొన్ననే రాజ్ కపూర్ తనయుడు రిషీ కపూర్ ను కోల్పోయిన బాలీవుడ్ పరిశ్రమ.. ఇప్పుడు అదే కుటుంబానికి చెందిన మరో వారసుడ్ని కోల్పోయింది. రాజ్ కపూర్ ఆఖరి తనయుడు రాజీవ్ కపూర్ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. ఆయన మరణం పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియచేశారు.
రాజ్ కపూర్ వారసుల్లో రణబీర్ కపూర్, రుషీ కపూర్ తర్వాత వాడు రాజీవ్ కపూర్. రామ్ తేరీ గంగా మెయిలీ, మేరా సాథీ, హమ్ టు చలే ఫారెస్ట్ లాంటి సినిమాల్లో రాజీవ్ కపూర్ నటించారు. 1991 లో హెన్నా సినిమాతో బాలీవుడ్ లో నిర్మాతగా అడుగుపెట్టారు రాజీవ్ కపూర్. అంతేకాకుండా.. ప్రేమ్ గ్రంథ్ సినిమాతో దర్శకుడిగా కూడా మారారు. రాజీవ్ మరణవార్తను నీతూ కపూర్.. సోషల్ మీడియాలో తెలియచేశారు.