కుటుంబ విబేధాలతో వైసీపీ అధినేత జగన్కి దూరం అయిన ఆయన సోదరి షర్మిల, భర్త బ్రదర్ అనిల్ కుమార్ .. వైసీపీ సర్కార్పై విరుచుకుపడుతున్నారు.. ఆస్తి వివాదాలతోపాటు, రాజకీయ పరంగా కూడా జగన్, షర్మిల మధ్య కలహాలు మొదలయ్యాయి.. ఇటీవల ఆమె కాంగ్రెస్లో చేరి, ఆ పార్టీ ఏపీసీసీ చీఫ్గా నియమితులవడంతో అవి ముదిరిపాకాన పడుతున్నాయి.. జగన్కి ఇబ్బంది కరంగా మారుతోంది కుటుంబ వాతావరణం..
జగన్ పాలనపై షర్మిల భర్త, బ్రదర్ అనిల్ కుమార్ విరుచుకుపడ్డారు.. జగన్ సర్కార్ వైఫల్యాలను ఆయన దుయ్యబట్టారు.. వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు పాలనలో రాష్ట్రంలో క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదని అంతర్జాతీయ సువార్తీకుడు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ నిప్పులు చెరిగారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ అంతకంతకూ అప్పుల పాలవుతోందని, పుట్టబోయే బిడ్డలపైనా అప్పులు భారం పడే పరిస్థితి నెలకొందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాసనాలను మార్చేస్తూ కొత్త అర్థాలు తీసుకొస్తున్నారని విరుచుకుపడ్డారు. శత్రువులందరూ నశించిపోవాలని నినదించిన ఆయన..రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అభిప్రాయపడ్డారు బ్రదర్ అనిల్..
గత రెండు దఫాల ఎన్నికలలో జగన్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగారు బ్రదర్ అనిల్.. టీడీపీకి వ్యతిరేకంగా క్రైస్తవ ఓటు బ్యాంక్ని పోలరైజ్ చేయడంలో సక్సెస్ అయ్యారు.. జగన్తో విబేధాల కారణంగా ఆయనకి వ్యతిరేకంగా తన అనుకూల క్రైస్తవుల ఓట్లను కాంగ్రెస్వైపు మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.. దీంతో, బావ దూరం కావడంతో ఆ బాధ్యతను మేనత్త విమలారెడ్డికి అప్పగించారు జగన్.. రాష్ట్రంలోని అనేక నియోజకవర్గాలలో పర్యటిస్తూ పాస్టర్ల ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తున్నారు. బ్రదర్ అనిల్ లేని లోటును భర్తీ చేసుందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. మరి, ఈ వార్లో బ్రదర్ అనిల్.. బావ జగన్పై ఎలాంటి రివేంజ్ తీర్చుకుంటాడో చూడాలి..