కర్నాటక మాజీ మంత్రి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్కి అత్యంత సన్నిహితుడుగా ముద్ర పడిన గాలి జనార్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. ఆయన పాపం పండింది.. గత కొన్నేళ్లుగా నడుస్తోన్న ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.. ఈ కేసులో ఆయనకి ఏడు సంవత్సరాల శిక్ష విధించింది.. ఆయన వ్యాపార భాగస్వామి శ్రీనివాస్ రెడ్డికి పదేళ్ల జైలు శిక్ష విధించింది.. ఇటు, మరో ఇద్దరికి మూడు సంవత్సరాల శిక్షను విధించగా, గనుల శాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చింది..
ఈ కేసులో మొదట ఆయనకి పది సంవత్సరాల శిక్ష విధించగా, తన వయసు రీత్యా శిక్షని తగ్గించాలని కోరారు గాలి జనార్ధన్ రెడ్డి.. దీంతో, ఆయనకి ఏడు సంవత్సరాల శిక్షను కన్ఫర్మ్ చేసింది సీబీఐ స్పెషల్ కోర్ట్..
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (OMC) అక్రమ ఇనుప గనుల తవ్వకాల కేసు భారతదేశంలో గనుల రంగంలో జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది… ఈ కేసు గత 16 ఏళ్లుగా నడుస్తోంది.. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని ఓబుళాపురం వద్ద ఇనుప గనుల తవ్వకాల కోసం OMCని స్థాపించారు. ఈ గనులు కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దు సమీపంలో ఉన్నాయి. బళ్లారి దగ్గరగా ఉన్నాయి. OMC .. తమకు అనుమతించిన గనుల సరిహద్దులను మించి, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో అనుమతి లేని ప్రాంతాల్లో ఇనుప గనులను తవ్విందని ఆరోపణలు వచ్చాయి. ఈ తవ్వకాలు నిర్దేశిత పరిమితులను ఉల్లంఘించి, పర్యావరణ నష్టానికి దారితీశాయి.
OMC తమ గనుల సరిహద్దు గీతలను అక్రమంగా మార్చడం ద్వారా కర్ణాటకలోని గనులను ఆంధ్రప్రదేశ్ గనులుగా చూపించి తవ్వకాలు జరిపిందని సీబీఐ ఆరోపించింది. దీని వల్ల రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు తలెత్తాయి. అక్రమంగా తవ్విన ఇనుప ఖనిజాన్ని రవాణా చేసి, దేశీయ మార్కెట్తో పాటు చైనాకు ఎగుమతి చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఎగుమతులు తక్కువ రాయల్టీలు చెల్లించడం లేదా రాయల్టీలను పూర్తిగా తప్పించడం ద్వారా జరిగాయని సీబీఐ అధికారుల వాదన.
సీబీఐ దర్యాప్తు ప్రకారం, ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందనే ఆరోపణలు ఉన్నాయి.. వీటికితోడు అదనంగా, పర్యావరణ నష్టంతోపాటు స్థానిక ప్రజలని సైతం ఇబ్బందులకి గురి చేశారనే విమర్శలు ఉన్నాయి..
గత పదహారేళ్లలో ఈ కేసులో అనేక ట్విస్టులు చోటు చేసుకున్నాయి.. గాలి జనార్ధన్ రెడ్డి తన రాజకీయ ప్రభావాన్ని ఉపయోగించి అధికారులను ప్రభావితం చేసి, గనుల లైసెన్స్ల అనుమతులను పొందినట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
2009-2010లో ఈ అక్రమాలపై ఫిర్యాదులు రావడంతో, సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2011లో గాలి జనార్ధన్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది, ఆయన హైదరాబాద్, బెంగళూరు జైళ్లలో మూడేళ్లకు పైగా గడిపారు. 2015లో ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ కేసులో గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి (OMC MD), వీడీ రాజగోపాల్, కె.మెఫజ్ అలీఖాన్తో సహా పలువురిని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు… మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృపానందం కూడా ఈ కేసులో నిందితులుగా ఉన్నారు… సుదీర్ఘ విచారణ జరిపిన సీబీఐ స్పెషల్ కోర్టు… తాజాగా గాలి జనార్ధన్ రెడ్డి (A2), బీవీ శ్రీనివాసరెడ్డి (A1), వీడీ రాజగోపాల్ (A3), మరియు కె.మెఫజ్ అలీఖాన్ (A7)లను అక్రమ తవ్వకాలు, కుట్ర, మరియు ఆర్థిక నష్టం కలిగించినందుకు దోషులుగా తేల్చింది. వీరికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధించబడింది. సబితా ఇంద్రారెడ్డి, కృపానందంను నిర్దోషులుగా తేల్చి, వారిపై ఆరోపణలను కొట్టివేసింది.
గాలి జనార్ధన్ రెడ్డి తన వయసు (57 సంవత్సరాలు), సామాజిక సేవలను పరిగణనలోకి తీసుకుని శిక్షను తగ్గించాలని కోరినప్పటికీ, న్యాయమూర్తి ఈ కేసు యొక్క తీవ్రతను గుర్తించారు. ఈ నేరం 10 సంవత్సరాల శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్షకు కూడా అర్హమని, అయినప్పటికీ ఏడు సంవత్సరాల శిక్ష విధించినట్లు వివరించారు.. ఈ శిక్ష ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. ఎందుకంటే రెండు సంవత్సరాలకు మించిన శిక్ష పొందిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులవుతారు.
మొత్తమ్మీద, గాలి జనార్ధన్ రెడ్డి పాపం పండింది.. ఈ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్పైనా ఆరోపణలు వినిపించాయి.. క్విడ్ ప్రో కోతో ఆయన కంపెనీలలో భారీగా పెట్టించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. మరి, వీటిపైనా దర్యాప్తు జరుగుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది..