ప్రజాహిత చట్టాలు అపహస్యం!
ప్రజాహితం కోసం రూపొందించిన చట్టాలు చట్టసభల్లో అపహస్యమవుతున్నాయి! రాజకీయ దురుద్దేశంతో చేసే చట్ట సవరణలు న్యాయ స్థానంలో మొట్టికాయులు వేయించుకుంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ఛీత్కరాలకు గురౌతున్నాయి. ఈ రెండునరేళ్లల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలకు సుమారు 200 లకు పైగా మొట్టికాయాలను హైకోర్టు వేసింది. అయినా జగన్ రెడ్డి తన జగమొండి వైఖరిని విడనాడడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ తరహాలోనే ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్లైన్ విక్రయించేందుకు సినిమాటోగ్రఫి చట్ట సవరణ చేసింది. దీనిపై ప్రభుత్వం నోటిఫికేషన్ వెలువడిన తరువాత న్యాయ పోరాటానికి దిగుతామని ఇప్పటికే సిని పరిశ్రమ ప్రముఖులు సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో సినిమాటోగ్రఫి చట్ట సవరణ కూడా కోర్టు మెట్లేక్కి పరిస్థితి లేకపోలేదు.
అప్పుల కోసం ఆన్ లైన్ విధానం టికెట్ల విక్రయం!
అప్పుల కోసమే ఆన్లైన్ లో సినిమా టికెట్ల విక్రయానికి తెరతీశారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వాస్తులు అమ్ముతున్నాడని, బ్యాంకు వద్ద తాకట్టుకు సైతం వెనకాడడం లేదని విమర్శిచారు. భవిష్యత్తులో జగన్ రెడ్డి లాంటి వారు ఉంటారనే ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నాడు.