ఏపీపై కరోనా విరుచుకుపడుతూనే ఉంది. అంతటా కేసులు తగ్గుతున్నా.. ఇక్కడ మాత్రం కేసులు కేసులు వెలుగుచూస్తున్నాయి. ప్రతిరోజు రెండు వేల నుంచి మూడు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. చిత్తూరు జిల్లాలో వైరస్ విజృంభణ మరి ఎక్కువగా ఉంది. హాస్పిటల్స్ లో బెడ్లు లేక, ఆక్సిజన్ అందక కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలోనూ కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. కరోనాకు చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
కుప్పానికి ఆక్సిజన్ ప్లాంట్
ఆక్సిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు రూ.45 లక్షల వ్యయంతో ఆక్సిజన్ ప్లాంట్ ను మంజూరు చేశారు. గురువారం పశ్చిమబెంగ నుంచి ఆక్సిజన్ ప్లాంటు కుప్పం చేరుకుంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూజలు చేసి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ తో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన ఔషధాలను టీడీపీ పంపిణీ చేసింది. మూడో వేవ్ ముంచుకొస్తున్న నేపథ్యంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ అత్యవసర సేవల కింద ఉపయోగపడనుంది.
హెల్ప్ లైన్ ద్వారా కొవిడ్ చికిత్స
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండటంతో.. పేదల కోసం ఎన్టీఆర్ ట్రస్టు ‘కొవిడ్ హెల్ప్ లైన్‘ ను ప్రారంభించింది. దీని ద్వారా ఏపీలోని మంది కొవిడ్ రోగులకు ఉచిత వైద్యం అందించింది. కరోనా నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే మందులు వాడాలి? పలు విషయాలపై అవగాహన కల్పించి రోగులను ఆదుకుంది. వ్యాధి తీవత్ర ఉన్న రోగులకు ట్రస్టులోనే ఆశ్రయం ఇచ్చి, ప్రాణాలను కాపాడింది. ఏపీ ప్రజలే కాకుండా.. టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైతం ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సేవలను పొందారు. ఇప్పటికే ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్టు కోవిడ్ పోరులో తనవంతు సాయం చేస్తూ ప్రజలకు ఊపిరిపోస్తోంది.
Must Read ;- చంద్రబాబు వల్లే మా ప్రాణాలు దక్కాయి : టీడీపీ హెల్ప్ లైన్ తో కోలుకున్న కరోనా బాధితులు