నియంతలు ఎవ్వరూ విజేతలుగా నిలవలేదు.ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిశారు.మీరొక లెక్కకాదు. ఈజిప్ట్ లో ముబారక్ కు ఏమైంది.? జర్మనీలో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముస్సోలినీ, సద్దాం హుసేన్, ఇడీ అమీన్, హిట్లర్ ఆలోచనల కలగలిసిన రూపమే జగన్ అని చెప్పాలి.
రాష్ట్ర వ్యాప్తంగా రగులుతున్న జనాగ్రహం జగన్ భ్రష్ట పాలనకు తెరదించ బోతున్నదని గ్రహించిన జగన్ ప్రభుత్వం చీకటి జీవో తెచ్చి ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసింది ప్రభుత్వం. ప్రభుత్వం పార్లమెంటరీ సాంప్రదాయాలను,పద్దతులను, కాలరాసి ఇష్టానుసారం నియంత పాలన సాగిస్తున్నారు జగన్ రెడ్డి .అధికారం గర్వంతో,లెక్కలేని తనంతో,రాక్షస పాలన సాగిస్తున్నారు.అహంకారులకు గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే,విమర్శించే హక్కు ప్రతిపక్షానికి,పౌరులకు రాజ్యాంగం ప్రాప్తించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19 ని అడ్డుకొనే చట్టమే లేదు. అత్యంత దుర్మార్గ మైన బ్రిటీష్ కాలం నాటి యాక్ట్ 1861 ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, రోడ్షోలు నిర్వహించరాదంటూ అనుమతి నిరాకరిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అర్ధరాత్రి చీకటి జీవో జారీ చెయ్యడం దుర్మార్గపు చర్య.
జగన్ పరిపాలనలోప్రజాస్వామ్యానికి పెడరెక్కలు విరిచే వికృతం విశ్వరూపం దాల్చింది. ఈ ధోరణిని అరికట్టలేకపోతే ప్రజాస్వామ్య మనుగడ పెను ప్రమాదంలో పడటం కాయం.ప్రశ్నిస్తున్న,విమర్శిస్తున్నప్రతిపక్షాల,మీడియా గొంతునొక్కేసి రాజ్యమంతా సుఖసంతోషాలతో వర్ధిల్లుతుందని ప్రచారం చేసుకోవాలని చూస్తున్నది జగన్ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రతిపక్షాలు సభలు,సమావేశాలు,రోడ్డు షో లు నిర్వహించే హక్కుకూడా లేకపోతె ఇది ప్రజా స్వామ్యమా?జగన్ స్వామ్యమా? రాష్ట్రం జగన్ జాగీర్ అనుకొంటున్నారా? స్వేచ్చకు సంకెళ్లు వేస్తారా?ఎదో వంకన ప్రతిపక్షాల స్వేచ్ఛను,పత్రికా స్వేచ్ఛను, భావ ప్రకటన స్వాతంత్య్రాన్ని కబళించే కుట్రలకు పాల్పడుతున్నారు. కందుకూరు, గుంటూరులలో జరిగిన ప్రమాద ఘటనలను సాకుగా చూపిస్తూ ఈ చీకటి జీవో తీసుకురావడం అత్యంత దుర్మార్గమైన చర్య.స్వాతంత్ర్యానికి ముందు బ్రిటీష్వారు అమలు చేసిన పోలీస్ యాక్ట్లో సెక్షన్లను అనుసరించి జగన్ రెడ్డి ప్రభుత్వం అప్రజాస్వామికంగా ఉత్తర్వులివ్వడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం.
ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే సభల నిర్వహణకు అనుమతిస్తారట, అంటే అధికార పార్టీకి మాత్రమే ప్రత్యేక పరిస్థితులు వర్తించే విధంగా ప్రతి పక్షాలను నియంత్రిoచే విధంగా జీవో జారీ చేశారు.జీవో నెంబర్ 1 ని చదివితే బ్రిటీష్ కాలం నాటి పాలన గుర్తుకు వస్తుంది. రాజ్యాoగం కల్పించిన హక్కులను ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా హరించివేయాలనుకోవడం ఏమిటి? జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 144,మరియు 30 సెక్షన్లు నిరంతరం అమలు చేస్తూనే వున్నారు. తానూ ప్రతి పక్షంలో వున్నప్పుడు అనేక రోజులు రోడ్ల పై పాద యాత్రలు,దీక్షలు చేశారు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకొంటే జగన్ రెడ్డి పాద యాత్ర చేసేవారా? ప్రతిపక్షాల సభలకు,రోడ్డు షో లకు అనుమతి నిరాకరిస్తూ జీవో తెచ్చిన ప్రభుత్వం .రాజమండ్రిలో,విజయనగరంలో రోడ్డు షో లు,ర్యాలీలు చేశారు. ప్రభుత్వానికి ఒకన్యాయం,ప్రతిపక్షాలకు మరొక న్యాయమా?
స్వాతంత్ర ఉద్యమ సమయంలో బ్రిటీష్ వాళ్ళ కంటే జగన్ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తుంది.ప్రతిపక్షనేత చంద్రబాబు సొంత నియోజక వర్గంలో పర్యటించే హక్కులేదా? ప్రతిపక్షనేతను ఏ చట్టం ప్రకారం అడ్డుకొన్నారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.1961 చట్టప్రకారం అయితే అందులోని 46 వ నిబంధన ప్రకారం మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇది వర్తించదు. ఇప్పటికే ఒక చట్టం వుంది. ఈ చట్టాన్ని ఆమోదించాలంటే గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాలి. ఈ చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారో చెప్పాలి. ఒక వేళ ఇప్పటికే చట్టం అమల్లో ఉంటే కొత్తగా జీవో ఎందుకు తెచ్చారు?చట్టం అమలు లో లేకుంటే జీవో దేని ప్రకారం తెచ్చారు?చీకటి చట్టం తెచ్చి ప్రతిపక్షాల గొంతునొక్కుతున్నది జగన్ ప్రభుత్వం. చంద్రబాబు సభలను వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక అడ్డుకొనేందుకు చీకటి జీవో జారీ చేసింది. ప్రతి పక్షాల ర్యాలీలు,సభల పై నిషేధం విధించడం జగన్ రెడ్డి నీచరాజకీయానికి నిదర్శనం.
అధికారులు నిర్ణయించిన ప్రదేశంలో మాత్రమే సభలు పెట్టాలని నిబంధనలు విదించిన ప్రభుత్వం, తాము రాసిచ్చిన ప్రసంగాన్నే చదవాలని కూడా నిబంధన తెస్తారేమో? అణచి వేత,నిర్భందం పెత్తందారులు,ప్యాక్షనిస్టులు తప్ప మరొకరు చెయ్యలేరు. దేశం లో ఏ ప్రభుత్వం ఈ విధమైన వికృత రూపం ప్రదర్శించడలేదు. ప్రతి పక్షాలు,మీడియా ప్రభుత్వానికి భజన చెయ్యాలి అనుకోవడం ప్రజాస్వామ్యంలో ఎలా సాధ్యం? జగన్ ప్రతిపక్షంలో వున్నప్పుడు పాదయాత్రలు,రోడ్లపై సభలు,ధర్నాలు,దీక్షలు చెయ్యలేదా?మీరు సభలు,సమావేశాలు పెట్టవద్దని,ర్యాలీలు చెయ్యవద్దని జీఓ లు జారీ చేస్తే ప్రతిపక్షాలు చేతులు కట్టుకొని నిలబడాలా? ప్రతిపక్షాల,పత్రికల స్వేచ్చకు గోరీ కట్టే నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించదు.స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి కి తానూ చేస్తున్న పనుల్లో,కార్యక్రమాల్లో తప్పులు కనిపించవు.
తన ప్రయోజనాలు తప్ప.రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికార పీఠం అదిష్టించిన జగన్ రెడ్డి ఆ ప్రమాణాన్ని పాతాళంలో పాతరేశారు. జగన్ ఫాసిస్టు క్రూర మనస్తత్వానికి అధికారం తోడై ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుంది. ప్రభుత్వం మాదే,వ్యవస్థలు మావే,మేము చేసిందే చట్టం,మేము చేసేదే పరిపాలన అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఎవ్వరూ ఎదురు రాకూడదని,తమకు అందరూ భయపడాలని నిరంకుశంతో,నిర్భందాలతో పాలన సాగిస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దానిని ఎవ్వరు అతిక్రమించరాదని .సభలు,సమావేశాలు,ప్రదర్శనలు జరిపే హక్కు రాజకీయ పక్షాలకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలకులు నిరంకుశంగా,నాప్రభుత్వం నా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు,ప్రతి పక్షం మాత్రం చట్టాలను,జీవో లను ఎందుకు గౌరవించాలి?
శాంతియుత ప్రదర్శనలకు సభలకు,పరామర్శలకు అనుమతులు నిరాకరించడం,ముందస్తు అరెష్టులకు పాల్పడటం,గృహ నిర్బంధాలు వంటి నిరంకుశ చర్యలతో పాలన సాగిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు కనీసం బాధితులను పరామర్శకు కూడా వెళ్లకుండా నిర్బంధిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా?లేక రాచరికమా? అధికార పార్టీ దన్నుతో పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు.పోలీసులు ప్రజల,ప్రతిపక్షాల హక్కులు,స్వేచ్చను కాపాడడానికి వున్నారని హైకోర్టు హెచ్చరిక లను పోలీసులు ఖాతరు చెయ్యడం లేదు. జనహితం కోసం పనిచేయాల్సిన పోలీసులు పాలకుల హితంకోసం పనిచేస్తున్నారు.పాలకుల తప్పులను,అసమర్ధతను, వైపల్యాలను,జరుగుతున్న నేరాలను,ఘోరాలను ప్రతిపక్షం ప్రశ్నించడం నేరమా? జగన్ రెడ్డి అహంకారంతో,ప్యూడలిస్ట్ స్వభావంతో పరిపాలనసాగిస్తున్నారు. ఇప్పటికే జగన్ ప్రభుత్వ,వేధింపులు, సాధింపులు,నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయస్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి అడుగులకు మడుగులోత్తుతూ ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. రాష్ట్రంలో పోలీసులు నేరం చేసిన వారిని కాపాడుతున్నారు.
బాధితుల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాల పై అక్రమకేసులు బనాయిస్తున్నారు. ప్రజలకు విధేయులుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా వున్నామని నిరూపించుకోవడానికి పోలీసు వ్యవస్థ అంతులేని ఆరాటం ప్రదర్శిస్తుంది. హద్దులు దాటిన జగన్ అహంభావమే జగన్ ప్రభుత్వాన్ని ఓడించబోతుంది. ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపొయ్యారు .జగనొక లెక్కకాదు. ఓటమి నుండి తప్పించుకోవడానికి దుర్యోధనుడు మడుగులో దాక్కున్నా బైటకి పిలిచి ఓడించిన చరిత్ర తెలుసుకొండి. అట్లాగే జగన్ రెడ్డి, ప్రజలకు ముఖం చూపకుండా పరదాలు మాటున తిరుగుతున్నా బైటకు రప్పించి ఓడించడం ఖాయం. శిశుపాలుడుని నూరు తప్పులు వరకు శ్రీ కృష్ణుడు క్షమించినట్లే జగన్ పట్ల ప్రజలు ఇన్నాళ్లు సహనంగా వున్నారు. ఇంక ప్రజలు సహనం కోల్పోయారు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ గ్యాoగ్ అంతా సిద్ధంగా ఉండాలి. గుంటూరులో వరుసగా జరిగిన తొక్కిసలాట ఘటనల సాకుతో ప్రజా వ్యతిరేకతను, ఆందోళనలను అణచివేసేందుకు, ప్రతిపక్షాల గొంతు నులిమేందుకు ఇదే అదనుగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వివాదాస్పద జీవో జారీచేసి ప్రజాస్వామ్య పెడరెక్కలు విరిచేసింది ఈ ధోరణిని అరికట్టలేకపోతే ప్రజాస్వామ్య మనుగడ పెను ప్రమాదంలో పడటం కాయం.రాష్ట్రంలో ఒక హిట్లర్,ఒక తుగ్లక్,ఒక గోబెల్స్ లకు ప్రతిరూపం అయిన పరిపాలన సాగుతుంది