మెహ్రీన్ పేరు వినగానే అనిల్ రావిపూడి గుర్తుకొస్తారు. హనీ ఈజ్ ది బెస్ట్ గా ఆమెకు ఓ క్రేజ్ ను తీసుకొచ్చిన ఘనత మాత్రం అనిల్ రావిపూడిదే. హను రాఘవపూడి నుంచి అనిల్ రావిపూడి దాకా ఆమె సినీ పయనం నిరాటంకంగా సాగిపోయినా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. దానికి కారణం గత మార్చిలో ఆమె నిశ్చితార్థం జరగడం. పెళ్లి తర్వాత ఆమె సినిమాలు చేస్తుందా లేదా అన్న సందేహం చాలామందిలో ఉంది. అలాంటి మెహ్రీన్ కి ఓ క్రేజీ ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ లో టాక్ ఓ రేంజ్ లో వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలోని ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’తో ఈ అమ్ముడు టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
ఆ తర్వాత కుమ్ముడు మొదలెట్టింది. మహానుభావుడు, రాజా ది గ్రేట్, జవాన్, కవచం, ఎఫ్ 2 తదితర చిత్రాల్లో నటించింది. అయితే.. ఆశించిన స్ధాయిలో ఈ అమ్మడుకు బ్రేక్ రాలేదనే చెప్పచ్చు. ప్రస్తుతం ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 సినిమాలో నటిస్తోంది. కెరీర్ ఆశాజనకంగా లేదనుకుందో ఏమో కానీ.. పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యింది. హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్తో పెళ్లికి రెడీ అయ్యింది. గత నెలలలో భవ్య బిష్ణోయ్తో ఆమె వివాహం జరగాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
పరిస్థితులన్ని చక్కబడగానే అందరి సమక్షంలో ఘనంగా వీరి వివాహ వేడుకను జరుపుకావాలని నిర్ణయించుకున్నారు. అయితే.. పెళ్లి అనంతరం మెహ్రీన్ సినిమాలకు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంది. అయితే.. పెళ్లి వాయిదా పడటంతో దర్శకనిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాంటాక్ట్ చేస్తున్నారు. మ్యారేజ్ ఇంకా టైమ్ ఉండడంతో సినిమాల్లో నటించేందుకు ఓకే చెబుతోంది. పెళ్లి వాయిదా పడిన వెంటనే మారుతి -సంతోష్ శోభన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇక అసలు విషయానికి వస్తే.. బాలయ్యతో మలినేని గోపీచంద్ ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ లేదా త్రిష నటించే ఛాన్స్ ఉందని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా కోసం మెహ్రీన్ ను సంప్రదించినట్టు తెలిసింది. ఇప్పుడు బాలయ్య సరసన నటించే అవకాశం రావడంతో ఆమె కూడా ఈ ప్రాజెక్ట్కు ఓకే చేప్పినట్లు సమాచారం. ఇందులో ఆమె పాత్రకు రెమ్మ్యూనరేషన్ కూడా బాగానే ఆఫర్ చేశారని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. అయితే.. ప్రచారంలో ఉన్న ఈ వార్తలో వాస్తవం ఎంత అనేది తెలియాల్సివుంది.
Must Read ;- అనిల్ రావిపూడితో సినిమా పై బాలయ్య క్లారిటీ