బాలీవుడ్ నట దిగ్గజం దిలీప్ కుమార్ ఆరోగ్యం అభిమానుల్లో అందోళన నెలకొంది. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుసంగతి తెలిసిందే. దిలీప్ కుమార్ వయసు 99 ఏళ్లు. ముంబైలోని పీడీ హిందూజ ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ ఆధారంతో ఉన్నారు. కొన్ని వైద్య పరీక్షల నివేదికలు రావలసి ఉందని వైద్యులు అంటున్నారు. ఆయన గత కొంతకాలంగా శ్వాససంబధమైన సమస్యతో బాధపడుతున్నారు. సీనియర్ వైద్యులు నితిన్ గోఖలే, జలీల్ పార్కర్ లు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
1944లో జ్వార్ భాటా చిత్రంతో ఆయన సినీ రంగ ప్రవేశం చేశారు. పాకిస్తాన్ లోని పెషావర్ ఆయన స్వస్థలం. అసలు పేరు యూసుఫ్ ఖాన్. బాలీవుడ్ ను ఐదు దశాబ్దాల పాటు ఆయన ఏలారు. తన 22వ ఏట సినీరంగ ప్రవేశం చేశారు. కోహినూర్, ఆజాద్, మొఘల్-ఎ-అజామ్, బైరాగ్, శక్తి, దేవదాస్, గోపి, ఆద్మీ, సంఘర్ష్ లాంటి ఎన్నో చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. అందరూ ఆయనను ట్రాజెడీ కింగ్ అనేవారు.
1998లో విడుదలైన ‘ఖిలా’ ఆయన చివరి చిత్రం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎంతో మంది ఆతృతగా ఎదురుచూడటంతో దిలీప్ కుమార్ అధికారిక ట్విట్టర్ నుంచి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటామని దిలీప్ కుమార్ బంధువులు తెలిపారు. మీడియా కూడా ఏది పడితే అది రాయకుండా తాము అధికారికంగా ఇచ్చే సమాచారాన్ని జనానికి అందించాలని కోరారు.
Must Read ;- మెగాస్టార్ చెల్లెలిగా బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ?