‘ఓ మై ఫ్రెండ్’ మూవీతో టాలీవుడ్ లో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు వేణు శ్రీరామ్. ఆ సినిమా మిశ్రమఫలితం రాబట్టింది. అందుకేనేమో ఆరేళ్ళ వరకూ అతడికి మరో సినిమా పడలేదు. నేచురల్ స్టార్ నానీ హీరోగా .. వేణు తెరకెక్కించిన ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ నానీ కెరీర్ కు మంచి బూస్టప్ నిచ్చిన సినిమా అయింది. వదిన, మరుదుల సెంటిమెంట్ దానికి బాగా వర్కవుట్ అయింది.
అయితే ‘యం.సీ.ఏ’ సినిమా సూపర్ హిట్టయినప్పటికీ.. వేణు శ్రీరామ్ .. పవర్ స్టార్ తో ‘వకీల్ సాబ్’ ను టేకప్ చేయడానికి మళ్ళీ నాలుగేళ్ల టైమ్ పట్టింది. తనకి ఒక సినిమా ట్రాక్ మీదుండగా.. దాంతో పాటే మరో సినిమా ను డైరెక్ట్ చేయడం చేతకాదని ఓపెన్ గా చెప్పిన వేణు శ్రీరామ్.. ‘వకీల్ సాబ్’ మూవీ తర్వాత కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నట్టే కనిపిస్తున్నాడు. అయితే తదుపరి చిత్రం కథమీద కసరత్తు చేయడానికి వేణు ఈ సారి అంత ఎక్కువ టైమ్ తీసుకోడని అంటున్నారు.
దానికి కారణం వేణు నెక్ట్స్ మూవీ నేచురల్ స్టార్ నానీతో చేయబోతున్నాడట. నానీ తో సినిమా అంటే.. ఆషామాషీ కాదు కదా.. అందుకే ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళుతుందని తెలుస్తోంది. వేణు కథ నానీకి భలేగా నచ్చిందట. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ కథాంశంలాగానే.. ఇందులో కూడా ఓ సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉందట. అది సినిమాకే హైలైట్ కానుందట. ప్రస్తతుం వేణు పూర్తి స్ర్కిప్ట్ సమకూర్చే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం నానీ ‘శ్యామ్ సింగరాయ్’, అంటే సుందరానికీ’ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాలూ పూర్తయ్యాకా వేణు శ్రీరామ్ మూవీ సెట్స్ మీదకు వెళుతుందని సమాచారం. మరి వేణు ఈ సారి నానీతో ఎలాంటి సినిమా ప్లాన్ చేశాడో చూడాలి.
Must Read ;- అప్పుడు క్రికెటర్.. ఈసారి ఫుట్ బాల్ ప్లేయరట.. !