అన్నం మిగిలితే పారేయొద్దని, ఫోన్ చేస్తే డోంట్ వేస్ట్ ఫుడ్ ఫౌండేషన్ ప్రతినిధులు వచ్చి తీసుకెళ్లి పేదల ఆకలి తీర్చుతారని సీపీ అన్నారు. అందుకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం సజ్జనార్ మాట్లాడారు. ప్రస్తుతం కరోనా తరుణంలో చాలామంది పేదలు, సామాన్యులు చికిత్స హైదరాబాద్ కు వస్తున్నారు. కరోనా రోగులతో పాటు వచ్చే బంధువులు ఆకలితో అలమటిస్తున్నారని అన్నారు. అందుకోసమే ప్రత్యేక వాహనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఎవరైనా అన్నం మిగిలితే 7207103539 నంబర్కు ఫోన్ చేస్తే వారు వచ్చి భోజనం తీసుకెళ్లి పేదలకు పంపిణీ చేస్తారన్నారు. ఈ సందర్భంగా డోంట్ వేస్ట్ ఫుడ్ నిర్వాహకులను అభినందించారు.