అవినీతి,అబద్దాలతో పుట్టిన దొంగ సాక్షి అబద్దాలతోనే బతుకుతుంది. నిత్యం అబద్దాలు,కట్టుకథలు,కాకి లెక్కలతో రాయడానికి కూడా ఇంగితం ఉండాలి. రాజకీయ ప్రయోజనాలకోసం అవినీతి సొమ్ముతో రూ1246 కోట్ల విలువైన మీడియా సామ్రాజ్యం స్థాపించి గిట్టని ప్రభుత్వం, రాజకీయ పక్షం పై విషపు రాతలు రాస్తున్నారు.సొంత మీడియా ద్వారా వక్రీకరణ కధనాలు రాయడానికి రెండు పేజీలు కేటాయిస్తూ నిరాధారా ఆరోపణలతో కధనాలు రాస్తున్నారు. నిజాలు దాచి నీచపు రాతలు రాయడం,ప్రభుత్వం పై విషం చిమ్మడం జగన్ రోత పత్రిక సాక్షికి అలవాటు అయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు రాసిన తప్పుడు రాతలే, ఓడిపోయిన తరువాత కూడా అవే అబద్దపు నీచ,నికృష్ట రాతలు రాయడం శోచనీయం. పచ్చిగా నిజా,నిజాలతో నిమిత్తం లేకుండా పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి అరాచక రాతలు రాస్తున్నది రోత పత్రిక.వున్నది, లేనిది గాలి పోగేసి విషం కక్కుతూ కధనాలు రాస్తున్నది. ఇటువంటి ఉగ్ర రాతలు వల్ల ఉగ్రవాదులు వల్ల వచ్చే ప్రమాదం కన్నా,అబద్దాల రాతలు రాస్తూ ప్రజలను తప్పుదారి పట్టించాలని చూస్తున్న పత్రిక వల్లనే ప్రమాదం పొంచి వున్నది.ప్రతి అంశాన్నివక్రీకరిస్తూ ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. అబద్దాలతో,కుతర్క వాదనలతో ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి పూనుకొని తప్పుడు రాతలు రాస్తున్నారు.
యాక్సిస్ తో అడ్డగోలు ఒప్పందం -ప్రజలకు పాతికేళ్ల షాక్ అంటూ విద్యుత్ కొనుగోలు,ఒప్పందాలపై 5-5-25 న సాక్షి దినపత్రికలో తప్పుడు రాశారు.కేంద్రప్రభుత్వ సంస్థ సెకీ తో ఏడు వేల మెగా వాట్ల విద్యుత్తు ఒప్పందాన్ని కారు చౌకగా యూనిట్ రూ 2.49 కే అందించేలా ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మాజీ సియం జగన్ రెడ్డి రూ లక్ష కోట్లకు పైగా అదా చేస్తే అభినందించాల్సింది పోయి కుంభకోణంగా వర్ణించిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు యూనిట్ ఏకంగా రూ 4. 60 చొప్పున కొనుగోలు కు సిద్ధమైందని దేశ విద్యుత్తు రంగ చరిత్రలో కనివిని స్కామ్ అంటూ దొంగ సాక్షి తప్పుడు రాతలు రాసింది.ఈ తప్పుడు రాతలు ప్రభుత్వాన్ని ఏదో విధంగా బదనాం చేసేందుకు కట్టుకథలు రాస్తూ సొంత మీడియా ద్వారా విషం కక్కుతున్నారు. నిరాధారమైన, వ్యక్తీకరించబడిన రాతలు అవి. ప్రాథమిక ఉద్దేశ్యం ప్రకారం మరొక,రాష్ట్రంలో స్థాపించబడిన ఒక స్వతంత్ర సౌర ప్రాజెక్టునుఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతున్న RE హైబ్రిడ్ (విండ్,& సోలార్) ప్రాజెక్టుతో పోల్చడం. వార్తా సంస్థ వైపు నుండి వివిధ రకాల,PPAలను పోల్చడం మరియు ఉద్దేశాలను ఆపాదించడం తప్పు మరొకటి కాదు.విద్యుత్తు ఒప్పందాల పై రాష్ట్రాన్ని తానూ ఎదో ఉద్దరించినట్లు తప్పుడు రాతలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు జగన్ ముఠా. అబద్దాలను అందంగా చెప్పడం లో దొంగ సాక్షి ఆరితేరింది. ఆ పేపర్ కి అబద్దాలు తప్ప నిజాలు రాయడం తెలియదు.
Axis BBB ప్రొజెక్ట్ కి సంబంధించి, వైసీపీ పభుత్వం 2022 అంతే పవర్ కొనుగోలు ఒప్పందం (PPA) ఒప్పందం ప్రకారం యూనిట్ ధర రూ 5.12 ఒప్పందం చేసుకొన్నారు.
అంతేకాక, 2022లో కోర్టుకు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఒప్పందం ప్రకారం, గతంలో కుదిరిన MOU లను గౌరవిస్తామని ఒప్పుకున్నారు. ఆ హమీపై ఆధారపడి ఈ PPA సైన్ చేశారు.
ఇప్పుడు APERC (ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంతరణ సంస్త ) ఆ 2022 లో సైన్ చేసిన PPAకి ఆమాదం తెలిపింది.APERC స్వతంత సంస్థ, ఇది విద్యుత్తు చట్టం కింద పనిచేస్తుంది. అందులోప్రభుత్వానికి ఎలాంటి సంభందం లేదు.పైగా, APERC వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన రూ 5.12 టారఫ్ ను తగ్గించి రూ 4.60గా నిర్ణయించింది. అంటే యూనిట్ కి ధర తగ్గింది.
దీని వల్ల రాష్ట్రానికి ప్రతి ఏడాది రూ 108.78 కోట్లు ఆదా అవు తుంది.దీనివల్ల 25 ఏళ్ల కాలానికి రూ 2,719.45 కోట్లు ఆదా అవుతుంది.ఈ ప్రొజెక్టు ద్వారా ప్రతి సంవత్సరం 2,091.89 మిలియన్ యూనిట్లు (kWh) విద్యుత్తు ఉత్పతే అయ్య అవకాశం ఉంది.ఈ ప్రొజెక్టు బ్లూక్ఫేల్డ్ సంస్థ (Evren ద్వారా), యాక్సిస్ ఎనర్జీ కలిసి చేపడుతున్నారు.ఈ ప్రొజెక్టు నిర్మాణ దశలోనే రాష్ట్రానికి రూ.784 కోట్ల జీ ఎస్ టి ఆదా వస్తుంది.తర్వాత 25 సంవత్సరాల్లో ప్రతి ఏడాది రూ.29 కోట్ల SGST రావడం ద్వారా రూ.731 కోట్ల ఆదాయం రాష్ట్రానికి లభించనుంది. .ఈ ప్రాజెక్టు పరిశ్రమలకు ఏంతో ఉపయోగపడుతుంది . మిగతా ప్రాజెక్టుల కంటే ఎక్కువ సామర్థ్యాన్ని అందించడం ఈ ప్రాజెక్టు ప్రత్యేకత. కనీసం 60 శాతం సమర్దతతో పనిచేస్తుంది.
విండ్, నర్, ఎనర్జీ స్టోరోజ్ మూడింటిని కలిపి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వీక్ టైం లో 2 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ ను అందిస్తుంది.నేరుగా అనుసంధానమమతుంది, దాంతో ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవు.ఇంకా ప్రత్యేకంగా రూ.120 కోట్లు వెచ్చించి ఒక ట్రాన్స్ మిషన్ నెట్ వర్క్ కూడా నిర్మించబోతున్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం చీకటి రాజ్యంగా మారితే.. కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇంధన రంగంలో పెట్టుబడులు తీసుకువస్తు విద్యుత్తు రంగంలో వెలుగులు నింపుతుంది.
వైసీపీ చేసే విమర్శలు. వాళ్ల రాజకీయ ప్రయోజనాల కోసం కాగా కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతి అడుగు రాష్ట్ర భవిష్యతు కోసం పనిచేస్తుంది..