సామాజిక ప్రయోజనాలు కాపాడుకోవడం పర్యావరణ పరిరక్షణ పోరాడటం అనేది అందరి బాధ్యత అంటున్నారు సినీ ప్రముఖులు. దానికోసం స్వచ్చందంగా పోరాటానికి దిగారు. కొత్వాల్ గూడలో దేశంలోనే భారీ ఆక్వా మెరైన్ పార్క్ కు ప్రభుత్వం పూనుకుంది. ఆహ్లాదం కోసం నిర్మిస్తున్న ఈ పార్క్ పర్యావరణానికి పెద్ద ముప్పువాటిల్లుతుందని సినీ నటులు రేణూదేశాయ్, శ్రీదివ్య , దర్శకుడు శశికిరణ్ తిక్కా అంటున్నారు. అంతేకాదు దీన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎలాంటి పర్యావరణ అధ్యయనం లేకుండా చేపట్టిన ఈ పార్క్ నిర్మాణం ఆపివేయాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతోంది.
ఇలాంటి పార్క్ ల నిర్మాణం సింగపూర్, మలేసియా లాంటి దేశాలలో జరిగినప్పుడు మన దేశంలో ఎందుకు సాధ్యం కాదని కోర్టు ప్రశ్నించింది. అయితే వీటికి సమాధానం గా పిటీషనర్ తరపున న్యాయవాది శ్రీరమ్య వాదనలు వినిపిస్తూ ఎటువంటి పర్యావరణ అధ్యయనం లేకుండా ఏర్పాటుచేసే ఈ పార్క్ లతో జలచరాలకు, వన్య ప్రాణులకు నష్టం వాటిల్లుతుందనే వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం ప్రభుత్వానికి, హెచ్ ఎమ్ డీ ఏ లకు నోటీసులు జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారంజీలు ఆధ్వర్యంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.
దీనిపై పిటీషనర్స్ లో ఒకరైన దర్శకుడు శశికిరణ్ తిక్కా స్పందిస్తూ పర్యావరణానికి చేటు చేసే విధంగా ఉన్న ఈ ప్రాజెక్ట్ పై తాము చేస్తున్న ఈ పోరాటానికి ప్రజల మద్దతు కూడా కావాలన్నారు. వేలాది జలచరాల మనుగడకు ముప్పు వాటిల్లే ఆక్వా మైరైన్ పార్క్ లు పర్యావరణాన్ని దెబ్బ తీస్తాయని, వాటిని ఆహ్లాదం కోసం మనముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో చాలా చనిపోతాయన్నారు. తరువాత కత్రిమంగా ఏర్పాటు చేసిన లైట్స్ లో వాటి జీవనం అత్యంత బాధాకరంగా మారుతుందని, వేల గ్యాలన్ల నీటితో నడిచే ఈ ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కారణం కూడా అవుతాయని, ఇలాంటి పార్క్ ల నిర్మాణం చాలా దేశాలు వ్యతిరేకిస్తున్నాయని వివరించారు.
నటి సదా మాట్లాడతూ ఇప్పటికే నగరంలో నీటి సమస్య చాలా పెరుగుతుందని, మూడు వేల గ్యాలన్ల నీటితో నిర్మాణం అయ్యే ఇలాంటి ఆక్వా పార్క్ లు నీటి సమస్యకు కారణం అవుతాయని పేర్కొన్నారు. సహాజంగా సముద్రాలలో పెరిగే జలచరాలును పట్టి కత్రిమంగా నిర్మాణమయ్యే ఇలాంటి పార్క్ లలో ఉంచడం వాటి ప్రాణాలకే ప్రమాదంగా మారుతుందన్నారు. వాటిని పట్టి తెచ్చే ప్రక్రియలోనే చాలా జలచరాలు ప్రాణాలు కోల్పోతాయన్నారు. ఇలాంటి పార్క్ లు కాకుండా పర్యావరణంపై అవగాహన పెంచే పార్కు లను హెచ్ఎండీఏ వారు ఏర్పాటు చేస్తే మంచిదని సూచించారు.