ప్రజలు గోడు వీసమంతైనా పట్టని ప్రభుత్వాలు దొరకడం ఏ జన్మలో చేసుకున్న పాపమని జగన్ రెడ్డి పాలనను చూసి..ఏపీ ప్రజలు నెత్తినోరు కొట్టుకుంటున్నారు.
ఏపీలో రాక్షస పాలన రాజ్యమేలుతోంది. కూల్చడం తప్ప కట్టడం తెలియని ఒక నిర్భాగ్యుడి పాలనలో ఏపీ సర్వత్రా సర్వనాశనమైందనే చెప్పాలి. జగన్ రెడ్డి ఏలుబడిలో నాలుగునరేళ్ళుగా ప్రజలతో నరకానికి స్పెల్లింగ్ రాయించారు. మిచౌంగ్ తుఫానుతో ఏపీ కల్లోలం ఉంటే.. కనీసం వరద బాధితులను ఆదుకునే కనీస చర్యలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టలేకపోవడం కడు శోచనీయం. ఇక వారి మంత్రులైయితే కనుచూపు మేరలో కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో కనిపించకపోవడం గమనార్హం. రాష్ట్రంలో దాదాపు 9 జిల్లాలలో వరదలు ముంచెత్తి.., రైతులను రోడ్డున పడేలా చేసింది. వరదల్లో చిక్కుకున్న ప్రజలు.. సహాయ చర్యల కోసం కళ్ళు కాయలు కాచేవరకు ఎదురు చూస్తుంటే.. కంటతుడుపు చర్యలకు సైతం జగన్ రెడ్డి ప్రభుత్వం ఉపక్రమించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇది చాలదంటూ ఆ పార్టీకి చెందిన మంత్రి రోజా.. వానల్లో గోడుగు బట్టి.. మంచి పాటలతో రీల్స్ చేసుకుంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇది చూసిన వరద బాధితులు.., ప్రజలు.., రైతులు మండిపడుతున్నారు. నీకు బుద్ధి.., కనీస ఇంగితం ఉందా..? అంటూ తిట్టిపోస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలను రక్షించి, ఆదుకోవాల్సిన బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారే ఇలా చేస్తే ఎలా అంటూ సోషల్ మీడియా రోజా వీడియో పోస్ట్ చేసి.. ఏకిపారేస్తున్నారు.
భారీ వర్షాల దాటికి సర్వకోల్పోయి రిక్త హస్తలతో రోడ్డుపై నిలబడిన రైతును ఆదుకోవాలన్న కనీసం ఆలోచనలు చేయకుండా.. ఇలా సోషల్ మీడియా ప్రమోషన్ కోసం రీల్స్ చేయడం ఏంటీ రోజా అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రోజా చేసిన ఆ పనిని చూసిన ప్రజలు.. సైకో పాలనలో సైకోయిజం అంటే ఇలానే ఉంటుందని మండిపడుతున్నారు.