బొమ్మరిల్లు భామ.. అదేనండీ ‘కుదిరితే కప్పు కాఫీ.. వీలైతే నాలుగు మాటలు’ అంటూ ఊరించి జెనీలియా ఓ ఎమోషనల్ ట్వీట్ వైరల్ అవుతోంది. తెలుగులో చాలా సినిమాలు చేసిన జెనీలియా బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. కానీ తన అభిమానులకు మాత్రం ఆమె దగ్గరగానే ఉంటోంది. తన గురించి, తన ఫ్యామిలీ గురించిన విశేషాను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. తాజాగా ఆమె షేర్ చేసి ఫొటో, అందులో రాసిన అంశం నెటిజన్లను ఆకర్షిస్తోంది.
ఆమెకు ఇద్దరు పిల్లలు. మరో పక్క సొంత వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఆమె పెద్ద కొడుకు రియాన్ ఏడో పుట్టిన రోజు సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన అంశంలో ఏదైనా అర్థం ఉందేమోనని నెటిజన్లు వెతుకుతున్నారు. ఇంతకీ ఆ పోస్ట్ ఏమిటో చూద్దాం. ‘మైడియర్ బేబీ బోయ్, నీ బుల్లి బుర్రలో బోలెడన్ని కోరికలు, ఆశలు ఉన్నాయి. వాటిని కచ్చితంగా తీరుస్తానని నీ పుట్టిన రోజు సందర్భంగా మాటిస్తున్నా.
నువ్వు ఆకాశంలోకి ఎగరాలనుకుంటే నేను నీ రెక్కను కాలేను కానీ ఆ రెక్కల కింద గాలిని మాత్రం అవుతా. ప్రతి విషయంలో నువ్వు మొదటి స్థానంలో ఉండాలని నేను కోరుకోను. చివరి స్థానంలో ఉన్నా నేను ప్రత్యేకతను గుర్తిస్తా. అంతేకానీ నిరాశ పడను. ఎప్పుడూ నీ వెన్నంటే ఉంటూ నువ్వు ఒంటరి వాడివి కాకుండా చూస్తా.. సరేనా. నీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఐ లవ్ యూ బేవ్ బోయ్’ అంటూ భావోద్వేగానికి గురైంది. ఆమె ఈ పోస్ట్ పెట్టగానే బాలీవుడ్ సెలబ్రిటీలు, అభిమానులు కూడా స్పందించడం మొదలుపెట్టారు. ఎంతో కవితాత్మకంగా ఆమె ఈ పోస్ట్ పెట్టింది.