‘బాహుబలి’ సిరీస్ డార్లింగ్ సినీ కెరీర్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టింది. ఏ హీరోకి దక్కనంత రేంజ్ లో ఇమేజ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది. అంతర్జాతీయ స్థాయిలో అతడి పేరు మారు మోగిపోయేలా చేసింది. ప్రస్తుతం ప్రభాస్ తో సినిమా తీస్తే పాన్ ఇండియా రేంజ్ లోనే తీయాలని ఏ దర్శకుడైనా ఫిక్సయ్యేలా చేసింది. అందుకే ప్రభాస్ నుంచి ఇప్పుడు అన్నీ పాన్ ఇండియా మూవీసే వస్తున్నాయి.
విడుదలకు సిద్ధమవుతోన్న ‘రాధేశ్యామ్’ తో సహా.. ‘సలార్, ఆదిపురుష్’, నాగ్ అశ్విన్ సినిమాలు అన్నీ కూడా పాన్ ఇండియా కేటగిరిలో విడుదల కాబోతున్నాయి. ప్రభాస్ కొచ్చిన ఈ మహా క్రేజ్ వల్ల బాలీవుడ్ లో అతడికి ఓ రేంజ్ లో ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడిందట. అలాగే.. అతడ్ని తరచుగా ముంబై దర్శక నిర్మాతలు కలుస్తున్నారట. దీని కారణంగా ప్రభాస్ రోజూ .. హైద్రాబాద్ టు ముంటై అప్ డౌన్ చేయాల్సి వస్తోందట. దానికి తోడు అతడి సినిమాలన్నీ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో బాలీవుడ్ లో కూడా విడుదల కాబోతున్నాయి ..
అందుకే అతడికి ముంబైలోనే ఒక మంచి ఫ్లాట్ తీసుకొని అక్కడ మకాం పెట్టాలనే ఆలోచన వచ్చిందట. దాని కోసం ముంబై లోని ఓ పోష్ ఏరియాలో రూ. 75కోట్లు విలువ చేసే కలల సౌధంలాంటి అపార్ట్ మెంట్ తీసుకోబోతున్నాడట. దీనికోసం టీ సిరీస్ భూషణ్ కుమార్ అతడికి సహకరిస్తున్నట్టు తెలుస్తోంది.