ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి లైన్ క్లియర్ అయింది. దీంతో పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెడీ అవుతోంది. ఈ ఉద్యోగాల భర్తీకి జనవరిలోనే నోటిఫికేషన్ జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకున్నప్పటికీ..ఎస్సీ వర్గీకరణ కారణంగా ఆలస్యమైంది. ఇప్పటికే 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది కూటమి సర్కార్.
ప్రస్తుతం ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టుల భర్తీకి సంబంధించి 18 నోటిఫికేషన్లు APPSC దగ్గర పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు సంబంధించి 814 పోస్టులున్నాయి. అయితే, ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు..ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లు రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తిచేయొచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకోనుంది.
శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలు –
అటవీ శాఖ సెక్షన్ ఆఫీసర్ – 100 (30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్)
బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ ఆఫీసర్ – 691 (141 క్యారీ ఫార్వర్డ్)
డ్రాఫ్ట్స్మెన్ గ్రేడ్-2 టెక్నికల్ అసిస్టెంట్ – 13
తన్నేదార్ – 10
వచ్చే నెలలో గ్రూపు – 1 హాల్ టికెట్లు
వచ్చేనెలలో గ్రూపు-1 మెయిన్ ఎగ్జామ్స్ రాయనున్న అభ్యర్థుల హాల్టికెట్లు వెబ్సైట్లో పెట్టినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి.రాజబాబు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తం 7 పరీక్షలను ఎంపిక చేసిన 4 జిల్లాల్లో మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నారు.