కరోనా నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు, హాస్టళ్లు మూతపడ్డాయి. అయితే హాస్టల్స్ మూసివేయడాన్ని నిరసిస్తూ వరంగల్ కాకాతీయ విద్యార్థులు ఆందోళన చేశారు. యూనివర్సటీ మొదటి గేటు దగ్గర ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. ‘సీఎం డౌన్ డౌన్, కేసీఆర్ ఖబర్దార్’ అంటూ నినాదాలు చేశారు. హాస్టల్ మూసివేయాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమను చదువులకు దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం విద్యాసంస్థలను బంద్ చేస్తుందని ఆరోపించారు.
Must Read ;- కరోనా ఎఫెక్ట్ : తెలంగాణలో స్కూల్స్, కాలేజీలు బంద్