ఏం మాట్లాడినా వారికే చెల్లుతుంది. ఆయనగారికి.. ఆయన కొడుకు గారికి ఇంకా బాగా చెల్లుతుంది. తిట్టాలన్నా వారే.. సాయం చేయాలన్నా వారే. సారీ సాయం చేయరు.. చేస్తామని చెబుతారంతే, వారే కల్వకుంట్లవారు. చంద్రశేఖరరావు, తారకరామారావు ఇద్దరూ అదే బాపతు. ఉద్యమం సమయంలో బూతులు తిట్టినా వారికే చెల్లింది.. ఉద్యమం అయిపోయి అధికారం వచ్చాక.. ప్రేమ కురిపించడం వారికే చెల్లింది. ఉద్యమం సమయంలో వ్యాపారస్తులను, కాంట్రాక్టర్లను తిట్టడం వారికే చెల్లింది.. అధికారం వచ్చాక వారి దగ్గరే కమీషన్లు తీసుకుని ప్రాజెక్టులు అప్పచెప్పడం వారికే చెల్లిందని చెప్పుకుంటూ ఉంటారు. అవి రూమర్సే. నిజం ఎంతో మనకు తెలియదు.
లేటెస్టుగా కేటీఆర్ విశాఖ ఉక్కు విషయంలో..
లేటెస్టుగా కేటీఆర్ విశాఖ ఉక్కు విషయంలో తమ మద్దతు ఉందని.. అవసరమైతే విశాఖకు వెళ్లి పోరాడతామని ప్రకటించారు. దాంతో అందరూ షాకయ్యారు. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి గెలవటానికి ఎన్ని మాటలైనా..ఎంతటి మాటలైనా మాట్లాడతారని మరోసారి రుజువైంది. మాటే కదా.. అంటే పోలా అన్నట్లు అనేశారు కేటీఆర్. దీనిని పట్టుకుని మీడియా ఇక విశ్లేషణలు మొదలెట్టింది, డిబేట్లు పెట్టింది. తెలంగాణ ఆంధ్రాకు చెల్లించాల్సిన బకాయిల గురించి మాట్లాడరా.. విభజన చట్టంలో తెలంగాణకు రావాల్సిన వాటి గురించి అడగరా.. అంటూ ప్రశ్నలు వచ్చేశాయి. విజయశాంతి అయితే అమ్మకు అన్నం పెట్టలేనోడు.. పిన్నమ్మకు బంగారు గాజులు పెడతానన్నట్లు ఉందంటూ సెటైర్ విసిరింది.
ఇలా చర్చ జరగాలనేనా..
కేటీఆర్కు కావాల్సింది కూడా ఇదే. ఇలా చర్చ జరగాలి. దాయాది లాంటి ఆంధ్రాకు కూడా సాయం చేస్తాననేవాడిది ఏం గుండెరా అని మిర్చి సినిమా లెవెల్లో చెప్పుకోవాలి. తప్పు మీద తప్పు చేస్తున్న బీజేపీని దోషిగా నిలబెట్టినట్లు అవుతుంది.. ఎన్నికల్లో అడ్వాంటేజ్ అవుతుంది. ఇదే స్ట్రాటజీ కేటీఆర్ ఫాలో అయిపోయాడు.
గతంలో కేసీఆర్ సైతం
గతంలో ఆయన నాయన కేసీఆర్ సైతం అదే స్ట్రాటజీ ఫాలో అయ్యారు. రాష్ట్రం ఇస్తే నేను నీ మనిషిని అంటూ సోనియానే నమ్మేలా చేశారు. రాష్ట్రం ఇచ్చాక తూచ్ అన్నారు. ఉద్యమం సమయంలో ఆంధ్రోళ్లు అంతా పోతారు.. ఉద్యోగాలన్నీ మనవే.. ఆంధ్రా కంపెనీలన్నీ పోయి.. మన కంపెనీలొస్తాయ్ అని ప్రచారం చేశారు. కాని అధికారం వచ్చాక ఎవరికీ ఉద్యోగాలు రాలేదు.. ఆ కంపెనీలు ఎవరివైనా కప్పం కడితే చాలు.. తెలంగాణలో ఉండొచ్చనేలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాంటి కే సీఆర్ కొడుకు కేటీఆర్ విశాఖ స్టీల్ ఉద్యమానికి మద్దతిస్తానని ఓ మాట చెబితే ఎలా నమ్ముతారనే ప్రశ్నలు వస్తున్నాయి.
ఆ వ్యూహం ఫలిస్తుందో.. లేదో
కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ది పొందడానికే ఈ మాట మాట్లాడారని ప్రత్యర్ధులు మండిపడుతున్నారు. ఇక్కడ ఉన్న ఆంధ్రుల ఓట్లు పడినట్లు అవుతుంది.. బీజేపీని దోషిని చేసినట్లు ఉంటుంది అనేదే అసలు వ్యూహం. మరి ఆ వ్యూహం ఫలిస్తుందో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం చూస్తే గాని తెలియదు.
Also Read : కేంద్రం వైఫల్యాలను ప్రజలకు తెలియజేయండి: కేటీఆర్