డాక్టర్ల సూచన మేరకు సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నారు. సీఎం వ్యక్తిగత డాక్టర్ ఎంవీ రావు బుధవారం ఆయనకు మరోసారి వైద్య పరీక్షలు చేశారు. అయితే రాపిడ్ యాంటిజెన్ టెస్టులో కేసీఆర్ కు కరోనా నెగిటివ్ వచ్చింది. ఆర్టీపీసీఆర్ రిజల్ట్ మాత్రం గురువారం రానుంది. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ రావడంతో కేసీఆర్ కరోనాను జయించారని వైద్యులు చెప్పారు. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే కనుక, త్వరలోనే ఆయన హైదరాబాద్ కు రానున్నారు. కరోనా కేసులు, లాక్ డౌన్ లాంటి అంశాలపై సమీక్షలు జరిపే అవకాశం ఉంది. అయితే సీఎంతో పాటు ఎంపీ సంతోష్, మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డ విషయం విధితమే. అయితే సంతోష్ ఫౌంహౌజ్ లో ఉండగా, కేటీఆర్ హోం ఐసోలేషన్ ఉన్నారు. కేసీఆర్ కు నెగిటివ్ రావడంతో టీఆర్ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Must Read ;- వరంగల్ లో కరోనా విలయం : ఎంజీఎంలో 27 మంది మృతి