December 15, 2025 12:37 AM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

విశాఖలో కృష్ణా జలాల యాజమాన్య బోర్డు అందుకేనా?

కృష్ణ నది గురించి ఏర్పాటైన బోర్డు, సాగరతీరం విశాఖలో ఏర్పాటు కావడం ఏంటి? ఇందుకు లాజిక్ ఏంటో వైఎస్సార్సీపీ సంకల్పించిన అధికార వికేంద్రీకరణ అర్థం తెలిసిన వారికి కూడా చిక్కుముడే!

January 8, 2021 at 3:23 PM
in Andhra Pradesh, Editors Pick, General
Share on FacebookShare on TwitterShare on WhatsApp

కృష్ణాబోర్డు కార్యాలయం విశాఖకు తరలిస్తున్నారనే సమాచారం మరోసారి చర్చనీయాంశంగా మారింది.  రాష్ట్ర విభజన సమయంలో చాలా మంది నిపుణులు, రైతు సంఘాలు తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు మరింత పెరిగే ప్రమాదం ఉందని, వీటిని పరిష్కరించడానికి బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు రాష్ట్రం రెండు ముక్కలు కావడానికి నీరు కూడా ప్రధాన కారణం కావడంతో, భవిష్యత్తులో మరిన్ని సమస్యలు రాకుండా కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, నీటి పంపిణీ చేసేందుకు రాష్ట్ర విభజనకు ముందే అప్పటి ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నదీజలాల యాజమాన్య బోర్డులు ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కృష్ణా బోర్డును విజయవాడకు తరలించాలని గత ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేసింది. కృష్ణా బోర్డును హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడానికి ఏడేళ్లు ఎందుకు పట్టిందో ఎవరికీ అర్థం కాదు.

తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును విశాఖకు తరలించాలని కేంద్ర జల వనరుల శాఖకు లేఖ రాసింది. దానికి వారు కూడా అంగీకరించారు. అసలు కృష్ణా జలాలతో సంబంధం లేని  విశాఖలో  బోర్డు కార్యాలయాన్ని పెట్టడంపై రైతు సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా బోర్డును విజయవాడలో పెట్టాలని తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని వారు చెబుతున్నారు. కృష్ణా బోర్డు పెడితే జలాలు వినియోగించుకునే రాయలసీమలో లేదంటే విజయవాడలో ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును విశాఖలో ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయడం, వారు అంగీకరించడం జరిగిపోయాయి.  కృష్ణా జలాల యాజమాన్య బోర్డును విశాఖకు తరలించడం వెనుక కుట్ర సాగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

విశాఖలో  కృష్ణా బోర్డు పెట్టడం వెనుక వ్యూహమేంటి?

ఈ ఏడాది ఉగాది నాటికి విశాఖ నుంచి పరిపాలన సాగించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేఆర్ఎంబీ ని కూడా విశాఖలో ఏర్పాటు చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే విశాఖ ద్వారకా బస్ స్టేషన్ నాలుగో అంతస్థులో ఆర్టీసీ పరిపాలన కార్యాలయం ఏర్పాటు చేసేందుకు అన్ని పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలుస్తోంది. అమరావతి రాజధానిపై తీర్పు రావడమే ఆలస్యం వెంటనే కార్యాలయాలు విశాఖ తరలించేందుకు సిద్ధంగా ఉండాలని, విశాఖలో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. విశాఖ వెళ్లడానికి సచివాలయ సిబ్బంది సిద్దంగా ఉన్నారని ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటించడం కూడా ఈ సంకేతాలకు బలం చేకూరుస్తోంది.

విజయవాడ, వెలగపూడి, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో కొనసాగుతున్న 120కు పైగా ప్రభుత్వ కార్యాలయాలను కూడా ఏప్రిల్ 13 తరవాత విశాఖ తరలించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని తెలుస్తోంది.  ఎలాగూ రాజధానిని విశాఖకు తరలిస్తాం, కాబట్టి కేఆర్ఎంబీ విజయవాడలో పెట్టడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. బోర్డు మీటింగ్ లకు జలవనరుల శాఖ ఉన్నతాధికారులు హాజరు కావాల్సి ఉంటుంది కాబట్టి బోర్డు రాజధానిలో ఉంటే సౌకర్యంగా ఉంటుందనే వాదనను తెరమీదకు తీసుకువచ్చారు.  అయితే అసలు జలాలతో సంబంధం లేని ప్రాంతంలో కృష్ణా బోర్డు ఏర్పాటు చేయడం వెనుక అసలైన ఉద్దేశం ఇదేనని స్పష్టం అవుతోంది.

విశాఖలో బోర్డు పెడితే ఎలా నష్టం?

కృష్ణా జలాల యాజమాన్య బోర్డును విజయవాడలో కాని, కర్నూలులో కాని పెడితే ప్రయోజనకరంగా ఉంటుందని రైతు సంఘాల నాయకులు వాదిస్తున్నారు. కృష్ణా జలాలను వినియోగించుకునేది ముఖ్యంగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా జిల్లా రైతులు కాబట్టి ఈ ప్రాంతంలో బోర్డు పెడితే వారి సమస్యలు కూడా బోర్డుకు విన్నవించడానికి అనువుగా ఉంటుందనే వాదనను వారు వినిపిస్తున్నారు. మరో వైపు బోర్డు సమావేశాలకు తెలంగాణ అధికారులు కూడా తరచూ హాజరు కావాల్సి ఉంటుంది.  విజయవాడలో బోర్డు ఏర్పాటు చేస్తే  రెండు తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరు కావడానికి అనువుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

కృష్ణా నదిపై రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో ప్రధానంగా  జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు ప్రధానమైనవి. ఈ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు ఏ పంటకు ఎంత నీరు కావాలో రైతులు, రైతుసంఘాల నేతలు  వినతి పత్రాలు  ఇవ్వాలన్నా విజయవాడ అనుకూలంగా ఉంటుంది. ఎక్కడో శ్రీశైలం ప్రాజెక్టు ఆయకట్టుకు నీరు కావాలని రైతులు అడగాలంటే విశాఖ వెళ్లి బోర్డు అధికారులకు వినతిపత్రం ఇవ్వడం కూడా కష్టమే అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికీ కృష్ణా బోర్డు హైదరాబాద్ లో ఉండటం వల్ల నాగార్జునసాగర్ ఆయకట్టు రైతులకు సకాలంలో నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. అదే బోర్డు విజయవాడలో ఉంటే రైతులు వారికి సమస్య వచ్చినప్పుడు బోర్డు అధికారులకు చెప్పుకోవడానికి వీలు దొరుకుతుంది. తద్వారా ఆయకట్టుకు సకాలంలో నీరు విడుదల అయ్యే అవకాశాలు ఉంటాయని రైతులు అభిప్రాయపడుతున్నారు.

నీటి కొలతలే ప్రధాన సమస్య

కృష్ణా బోర్డు ఏ రాష్ట్రానికి ఎంత జలాలు అనే విషయాన్ని స్పష్టంగా ప్రకటిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఆయా ప్రాజెక్టుల్లో పనిచేసే అధికారులు ప్రభుత్వం చెప్పినట్టు వింటారు కానీ, బోర్డు ఆదేశాలు పట్టించుకోవడం లేదు. దీంతో మీరు ఎక్కువ జలాలు వాడుకున్నారంటే, మీరెక్కువ నీరు వాడేసుకున్నారనే విమర్శలు ఏటా మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఎత్తిపోతల పథకాల నుంచి ఎంత నీరు ఎత్తిపోసి వాడుకున్నారో తెలిపే లెక్కలు కూడా అందుబాటులో ఉండటం లేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, హంద్రీనీవా, గాలేరు నగరి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ ఎత్తి పోతల పథకాల ద్వారా ఏ రాష్ట్రం ఎంత నీరు వాడుకుందో బోర్డు వద్ద ఇప్పటికీ సరైన గణాంకాలు లేవు. బోర్డు కేవలం ఆదేశాలు జారీ చేయడం వరకే పరిమితం అవుతోంది.

ప్రాజెక్టులు నిర్వహించే సిబ్బంది వారి పరిధిలో ఉండరు. బోర్డు చెప్పిన ఆదేశాలు అధికారులు పాటిస్తున్నారా లేదా? అనేది కూడా వారికి తెలియడం లేదు. అందుబాటులో ఉన్న జలాల్లో ఏ రాష్ట్రానికి ఎంత అని చెప్పడం వరకే బోర్డు పరిమితం అవుతోంది. ఇక ప్రాజెక్టు ఏ రాష్ట్రం పరిధిలో ఉంటే వారు చెప్పిందే వేదం. ఇలాంటి పరిస్థితుల్లో కేఆర్ఎంబీని విశాఖలో ఏర్పాటు చేస్తే కృష్ణా జలాలపై ఆధారపడ్డ రైతాంగానికి పెద్దగా ఒరిగేదేమీ ఉండదు.  కృష్ణా జలాలను వాడుకునే ప్రాంతాల్లోని నగరాలైన విజయవాడ లేదా కర్నూలులో బోర్డు ఏర్పాటు చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Tags: ap krishna river boardDaily News Updateskrishna river management boardPolitical NewsVisakhapatnam Newsvizag politicsYsrcp govt
Previous Post

ఫిబ్రవరి 11న GHMC మేయర్ ఎన్నిక..TRSకే ఛాన్స్

Next Post

‘విగ్రహ’ జ్వాల ఆగేదెప్పుడు!

Related Posts

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

by లియో డెస్క్
December 13, 2025 7:04 pm

తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలతో కొనసాగుతున్న ఆస్తుల వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత...

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

by లియో డెస్క్
December 12, 2025 3:45 pm

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని మోదీకి లేఖ రాశారు. 2024 జూన్ 2...

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

by లియో డెస్క్
December 10, 2025 9:20 pm

తిరుమలలో మరో భారీ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే కల్తీ నెయ్యి, పరకామణి...

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

by లియో డెస్క్
December 10, 2025 8:18 pm

వైసీపీ హయాంలో ఢిల్లీలో తలదించుకున్న రాష్ట్రాన్ని.. గర్వంగా తలెత్తుకొనేలా చేసింది కూటమి ప్రభుత్వం....

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

by లియో డెస్క్
December 10, 2025 4:17 pm

కల్తీ నెయ్యి గురించి అప్పటి టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి ముందే తెలుసా.....

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

by లియో డెస్క్
December 9, 2025 6:21 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులు...

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

by లియో డెస్క్
December 8, 2025 9:47 pm

వైసీపీ మాజీ నేత, ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి...

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

by లియో డెస్క్
December 8, 2025 1:15 pm

మంత్రి నారా లోకేష్‌ అమెరికా పర్యటన గ్రాండ్‌గా స్టార్ట్‌ అయింది. డాలస్‌లో నిర్వహించిన...

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

by లియో డెస్క్
December 6, 2025 6:32 pm

కోనసీమకు దిష్టి తగిలిందని పవన్‌ కళ్యాణ్‌ ఏ ముహూర్తాన అన్నారో కానీ.. ఈ...

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

by లియో డెస్క్
December 5, 2025 7:35 pm

కుప్పంలో అప్పటి సీఎం జగన్‌ స్కిట్లు వేస్తే.. పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

పేర్ని నాని తప్పుకు అరదండాలు..?

Glamorous Beauty Kavya Thapar Beautiful Photos

Ghani Movie Actress Saiee Manjrekar Latest Photos

నటన, రాజకీయంలో ‘జయప్రద’మైన జీవితం

అప్సరసలు అసూయపడే అందమంటే ఇదేనేమో!

Bollywood Actress Sonam Bajwa Sexy Pictures

‘గజిని’ మెమరీ ఎవరికి లాస్?… ఎవరికి మెమెంటో?

Pooja Bhalekar Ups The Heat

ముఖ్య కథనాలు

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

సినిమా

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

రావు రమేష్ ప్రధాన పాత్రలో మారుతినగర్ సుబ్రమణ్యం

జనరల్

అది నా సొమ్ము… షర్మిలకు పైసా ఇవ్వను.. జగన్‌ రివర్స్‌ ఎటాక్‌..

మోదీకి చంద్రబాబు లేఖ..వైసీపీ గుండెల్లో వణుకు..

పట్టు వస్త్రాల పేరుతో పాలిస్టర్‌..TTDలో మరో భారీ స్కామ్‌..!

ఢిల్లీలో తొడకొట్టిన ఏపీ…. ఇండియాలో నెంబర్‌ వన్‌…!

కల్తీ నెయ్యి రిపోర్టులు మార్చిన సుబ్బారెడ్డి..?

USలో బిజిబిజీగా లోకేష్.. పెట్టుబడి దారులతో వరుస మీటింగ్స్‌..!

ఏపీలో మత మార్పిడి మాఫియా.. విజయసాయిరెడ్డి సంచలనం..!

ప్రవాసాంధ్రులకు లోకేష్ భరోసా.. డల్లాస్‌లో గ్రాండ్‌ వెల్‌కమ్‌..!

కోమటిరెడ్డి తగ్గాడు…. జగన్‌ కోసం తెలంగాణ నేతలని రెచ్చగొడుతున్న ఉండవల్లి..!!

పులివెందులకి 500 కోట్ల నిధులు జగన్‌ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి..

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist