సెన్సేషనల్ హీరో విజయ్ దేవర కొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. ఈ భారీ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ షూటింగ్ పూర్తి కావస్తోంది. తాజాగా ఈ చిత్రం అమెరికా షెడ్యూల్ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్లో ప్రముఖ బాక్సర్ మైక్ టైషన్, విజయ్ దేవరకొండ, అనన్యపాండేలకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించారు. ఒక చిన్న షెడ్యూల్ మాత్రమే పెండింగ్ లో ఉంది. ఈ షెడ్యూల్ ని ఇండియాలో తెరకెక్కిస్తారు.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఈ రోజు అభిమానులకు డబుల్ సర్ఫ్రైజ్ ఇచ్చారు నిర్మాతలు. అది ఏంటంటే.. ఈ సినిమా 2022 ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇక టీజర్ ను ఈ నెల 31న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త సంవత్సరం.. మంట పుట్టిందాం అంటూ నిర్మాతలు జోష్ పెంచారు. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ మూవీ అర్జున్ రెడ్డి కూడా 2017 ఆగస్ట్25నే విడుదలయ్యింది.
నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే తేదీన లైగర్ రాబోతుంది. విజయ్ కి మరో కల్ట్, ఐకానిక్ మరియు ట్రెండ్ సెట్టింగ్ మూవీ కానుంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా భారతదేశంలోని అతి పెద్ద యాక్షన్ ఎంటర్ టైనర్ లలో ఒకటిగా అలరించనుంది. బిగ్ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, మైక్ టైసన్ నిజమైన యాక్షన్ ను చూసేందుకు అభిమానులు .. సినీ ప్రేక్షకులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. మరి.. ఈ సినిమాతో విజయ్, పూరి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సెట్ చేస్తారేమో చూడాలి.
Must Read ;- బంగార్రాజులో రెండు ఐటం సాంగ్స్?