ఒకవైపు కరోనా కేసులు.. మరోవైపు ఆక్సిజన్ కొరత నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సంక్షేమం కోసం మరోవారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరిగిందని, కేసులు తగ్గుముఖం కోసం మరో వారం రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు, మే 3 ఆంక్షలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత కారణంగా ఢిల్లీలోని పలు ఆస్పత్రిల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని కేజ్రీవాల్ కోరారు.
Must Read : కేజ్రీ మరో కీలక నిర్ణయం : ఢిల్లీలో లాక్ డౌన్ పొడిగింపు