టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వేసిన ఒక్క క్వశ్చన్ యావత్తు మీడియాను పెను కలవరపాటుకు గురి చేసింది.సాక్షి మీడియా ప్రతినిధి ఎక్కడ? అంటూ ప్రశ్నించిన ఆయన…మీరేమైనా అడగాలనుకుంటున్నారా? అంటూ సదరు మీడియా ప్రతినిధిని ప్రశ్నించడంతో నిజంగానే మీడియా నోట మాట రాలేదనే చెప్పాలి.ఇక ఏపీ సీఎం జగన్ కుటుంబం ఆధ్వర్యంలో సాక్షి మీడియా ప్రతినిధికి అయితే తడిసిపోయినంత పనైందని చెప్పక తప్పదు.ఎందుకంటే… స్వయంగా లోకేశ్ అడిగినా…సాక్షి మీడియా ప్రతినిధి నుంచి సరైన ప్రశ్నేబయటకు రాలేదు.మొత్తంగా తనదైన మార్కు వ్యవహారంతో తనపై అవాకులు,చెవాకులు పేలుతున్న మీడియాకు లోకేశ్ నోట మాట రాకుండా చేసేశారు.
కార్యకర్తల సంక్షేమంపైనే దృష్టి..
చాలా కాలం క్రితమే రాజకీయాల్లోకి వచ్చిన లోకేశ్..ప్రత్యక్ష రాజకీయాల్లో కంటే కూడా టీడీపీ నిర్మాణం,కార్యకర్తల సంక్షేమంపై దృష్టి సారించి చాలా కాలం పాటు బయటకే రాలేదు.పార్టీ అంతర్గత నిర్మాణంపై దృష్టి సారించిన లోకేశ్.. అత్యధిక మంది సభ్యత్వం కలిగిన పార్టీగా టీడీపీకి చెరిగిపోని గుర్తింపు తీసుకువచ్చారు.అదే సమయంలో పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం పెరిగేలా పకడ్బందీ చర్యలు చేపట్టిన లోకేశ్..ఏదేనీ అనుకోని కారణాలతో పార్టీ కార్యకర్తలు మరణిస్తే… వారి కటుంబాలు రోడ్డున పడకుండా ఉండేలా చర్యలు చేపట్టారు.ఇందులో భాగంగా మరణించిన పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని కల్పించిన లోకేశ్…మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాల పిల్లలకు విద్యాబుద్దులు చెప్పించి,వారు జీవితంలో స్థిరపడేదాకా పూర్తి బాధ్యతలు పార్టీనే తీసుకునేలా విప్లవాత్మక చర్యలు చేపట్టారు.ఈ తరహా చర్యలతో లోకేశ్ సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసి వచ్చింది.
విషయాన్ని సూటిగా చెప్పేసిన లోకేశ్..
ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లోకేశ్…తొలుత ఎమ్మెల్సీగా చట్టసభల్లోకి అడుగుపెట్టి మంత్రి పదవిని చేపట్టారు.గ్రామీణాభివృద్ధితో పాటు ఐటీ శాఖను నిర్వహించిన లోకేశ్…అందులోనూ సత్తా చాటారనే చెప్పాలి.అయితే ప్రత్యక్ష రాజకీయాలతో అప్పటిదాకా అనుభవం లేని కారణంగా మీడియా ముందుకు వచ్చేందుకు తటపటాయించేవారు. ఇదంతా ఇప్పుడు గతమనే చెప్పాలి.సోమవారం విశాఖకు వచ్చిన లోకేశ్..అక్కడ ఇటీవలే గుండెపోటుతో మరణించిన డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత కాసేపే అయినా..మీడియాతో ముచ్చటించారు.స్వల్ప సమయమే అయినా…తాను చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పేసిన లోకేశ్… ఏమైనా ప్రశ్నలున్నాయా? అంటూ మీడియా ప్రతినిధులను అడిగి వారిని షాక్లో ముంచేశారు.మీడియా నుంచి పెద్దగా ప్రశ్నలు రాకపోయేసరికి… కాసేపు వేచి చూసిన లోకేశ్..ఆ తర్వాత జగన్ మీడియా సాక్షి ప్రతినిధులు ఎక్కడ? అంటూ ప్రశ్నించారు.దీంతో అంతా ఒక్కసారిగా షాక్ తినగా…సాక్షి ప్రతినిధిని ఉద్దేశించి మీరేమైనా ప్రశ్నలు అడుగుతారా? అంటూ ప్రశ్నించి మీడియా నోట మాట రాకుండా చేశారు.
రియల్ పొలిటీషియన్లా..
దీంతో సాక్షి మీడియా ప్రతినిధితో పాటు ఇతర మీడియా ప్రతినిధులు కూడా లోకేశ్కు ప్రశ్నలు సంధించే విషయంలో తటపటాయించారనే చెప్పాలి.ఎందుకంటే… లోకేశ్ తాను చెప్పాలనుకున్న విషయాన్ని చాలా క్లుప్తంగానే చెప్పినా..ఫుల్ క్లారిటీతో మాట్లాడారు.దీంతో ప్రశ్నల కోసం లోకేశ్ ఆఫర్ ఇస్తే…లోకేశ్ ప్రస్తావించిన ప్రధాన అంశం మీద కాకుండా మీడియా ప్రతినిధులు ఇతర అంశాలపై ప్రశ్నలు సంధించారు.అయినా కూడా వాటికి కూడా లోకేశ్ క్లుప్తంగానే సమాధానాలు ఇచ్చారు.ఆ తర్వాత సాక్షి ప్రతినిధిని లోకేశ్ ప్రశ్నిస్తారా? అని అడగ్గా… ఏదో లోకేశ్ అడిగారు కదా అన్న ధోరణిలో సీఎం జగన్ను దేవుడిగా సుధాకర్ తల్లి కీర్తించారు కదా అని అడగ్గా…మరి ఇప్పుడు సుధాకర్ మరణిస్తే సీఎం ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదు అంటూ లోకేశ్ ఎదురు ప్రశ్న సంధించారు.దీంతో సాక్షి ప్రతినిధి కూడా మిన్నకుండిపోక తప్పలేదు.మొత్తంగా విశాఖలో లోకేశ్ వ్యవహరించిన తీరు ఆయనలోని రియల్ పొలిటీషియన్ను బయటకు తెచ్చిందని,ఇకపై ప్రత్యర్థి పార్టీలతో పాటు మీడియాకు కూడా దబిడిదిబిడేనని చెప్పక తప్పదు.
Must Read ;- సుధాకర్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే : జగన్ పై నారా లోకేశ్ ఫైర్