May 12, 2026 7:46 PM
25 °c
Hyderabad
26 ° Tue
26 ° Wed
26 ° Thu
26 ° Fri
  • Login
The Leo News | Telugu News
  • English
  • Leo Poll
  • Leo Channel
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్
No Result
View All Result
The Leo News | Telugu News
English
No Result
View All Result
Home Politics Andhra Pradesh

మోదీ ‘ఏక్తా’ నినాదానికి సరికొత్త రూపం.. జమిలి ఎన్నికలు!

ప్రధాని మోదీ చేస్తున్న జమిలి ఎన్నికల ఆలోచనకు ఇప్పటికే కొన్ని రాష్ట్రాల మద్దతు ఉంది. ఆ ఆశతోనే కేంద్ర ప్రభుత్వం ముందుకు దూసుకెళుతున్నట్టుగా కనిపిస్తోంది.

November 27, 2020 at 3:25 PM
in Andhra Pradesh, Latest News, National, Opinion
Share on FacebookShare on TwitterShare on WhatsApp

దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహిస్తే.. ఖర్చుల పరంగా ఎంతో మేలు జరుగుతుందనేది ప్రధాని నరేంద్రమోదీ అభిభాషణ. అయితే ఈ ఆలోచన వెనుక గోప్యంగా.. రాజకీయ వక్ర ప్రయోజనాలు ఉన్నాయనేది పలువురి అభిప్రాయం.

ఒకే దేశం ఒకే పన్ను పేరుతో అతి పెద్ద ఆర్థిక సంస్కరణలు– GST అమలు,  రైతులు వ్యవసాయ ఉత్పత్తులను అధీకృత మార్కెట్లలోనే కాకుండా ఎక్కడైనా అమ్ముకోవచ్చనే లక్ష్యంతో ఒకే దేశం-ఒకే మార్కెట్ , ఒకే దేశం- ఒకే పరీక్ష, ఒకే దేశం-ఒకే రేషన్ తెచ్చారు. తాజాగా ప్రధాని మోదీ చేసిన ఒకే దేశం- ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికలు) అంశం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

1960వ దశకం నుంచి జమిలి ఎన్నికలపై చర్చ నడుస్తూనే ఉన్నా.. మోదీ ప్రభుత్వం దానిపై వేగంగా ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. జమిలి ఎన్నికలపై మోదీ చేసిన ప్రకటన నిన్నటికి నిన్ననే అనుకుని చేసింది కాదు. చాలా రోజులనుంచి కసరత్తు జరుగుతోంది. కాకపోతే గత ఏడాది జూన్ లో జరిగిన అఖిలపక్ష సమావేశం తరువాత మోదీ ప్రభుత్వం దూకుడు పెంచింది. ఆ అఖిల పక్ష భేటీకి 40 పార్టీలను ఆహ్వానించగా 21 పార్టీల అధ్యక్షులు హాజరయ్యారు. మరో 3 పార్టీలు లిఖిత పూర్వకంగా అభిప్రాయాలు తెలిపాయి. సీపీఎం, సీపీఐ, జేడీయూ, శిరోమణి, బీజేడీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, పీడీపీ, నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కాంగ్రెస్, తృణమూల్​, బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, తెదేపా, ఆమ్​ ఆద్మీతో పాటు శివసేన కూడా సమావేశానికి రాలేదు. వీటిలో కొన్ని పార్టీలు.. తాము ఇంకా దీనిపై చర్చించలేదని, తరువాత అభిప్రాయం తెలుపుతామని చెప్పాయి.

మోదీ చెప్పిన ప్రకారం.. ఏడాది పొడవుగా దేశంలో ఎక్కడోచోట ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. తద్వారా ఎన్నికల ఖర్చు పెరగడంతోపాటు.. అభివృద్ధి పనులను ఆటంకం ఉంటుందని, పాల.నా సౌలభ్యం ఉండదని, ఇది చర్చించే అంశం మాత్రమే కాదని, దేశానికి అవసరమని ప్రధాని మోదీ ప్రిసైడింగ్ ఆఫీసర్ల సదస్సులో వ్యాఖ్యానించడంతో మళ్లీ చర్చ మొదలైంది.

వాస్తవానికి దేశంలో 1967 వరకు జమిలి ఎన్నికలే జరిగాయి. 1971 తర్వాత వేరువేరుగా నిర్వహించడం మొదలైంది. దీనికితోడు 1970ల్లో అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాల మార్పులు, మధ్యంతర ఎన్నికలు జరగడం మొదలైంది. తరువాతి కాలంలో కేంద్రంలోని ప్రభుత్వాలు ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాలు కూలిపోవడంతో లోక్ సభ కూ మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.

Must Read ;- ఆమె కూడా మోదీ బాటలోనే వెళ్లనున్నారా..?

 ఖర్చు విషయానికి వస్తే..

ఎన్నికల సంఘం ప్రకారం మన దేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఎన్నికలకు కలిపి 4,900 కోట్లు అవుతుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికలకు అయ్యే ఖర్చును సగం చొప్పున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహిస్తే..రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. ఎన్నికల ఖర్చు దృష్టితో చూస్తే జమిలి ఎన్నికలు రాష్ట్రాలకు కొంత ఆర్థిక ఊరటను కలిగిస్తాయనడంలో సందేహం లేదు.

ఏళ్లతరబడి ఎన్నికలు..

2014–19 మధ్య జరిగిన ఎన్నికల ప్రచార సమయాన్ని పరిశీలిస్తే మొత్తం ఐదేళ్లలో రెండేళ్లు ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి. 2020నుంచి కూడా మళ్లీ అదే పరిస్థితి రానుంది. వచ్చే సంవత్సరం పశ్చిమబంగా ఎన్నికలు,  2022 ఫిబ్రవరి- మార్చి నెలల్లో ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, మణిపూర్‌ ఎన్నికలు జరుగునున్నాయి. 2022 అక్టోబర్‌, డిసెంబర్‌ నెలల్లో హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికలు జరగనున్నాయి. అంటే దేశంలో ప్రతి ఆరునెలలకి ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరగడం సాధారణమైంది. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై పార్టీలను ఒప్పించి.. ఈ 2022 ,2023, 2024లో జరగాల్సిన ఎన్నికలను కూడా అవసరమైనంత కాలం వాయిదా వేయడమో, ముందుకు జరపడమో చేసి- దేశ వ్యాప్తంగా లోక్‌ సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక ఎన్నికలను ఒకేసారి జరిపించాలన్నది మోదీ సర్కార్‌ వ్యూహంగా కనిపిస్తోంది. మరోవైపు లా కమిషన్‌, ఎన్నికల సంఘం కూడా సానుకూల నివేదికలు సమర్పించాయి. ఇక ఈ విధానం అమలు కావాలంటే ఉభయ సభల్లో ఆమోదం తోపాటు రాజ్యాంగ సవరణ కూడా చేయాల్సి ఉంటుంది.

రాజ్యాంగ సవరణ విషయానికి వస్తే..

74, 75 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు నగరపాలిత ప్రాంతాలకు కొన్ని వెసులుబాట్లు కల్పించారు. ఈ రెండు రాజ్యాంగ సవరణలలో పొందుపరిచిన 343(ఇ)4, 343(యు) 4 ప్రకరణల ద్వారా ఐదేళ్ల మధ్యకాలంలో ఏదైనా పంచాయతీలో కానీ నగరపాలిత ప్రాంతంలో కానీ మళ్లీ ఎన్నికలు జరిగితే, ఎన్నికైనవారు  స్థూల కాల పరిమితిలోనుంచి మినహాయించి.. శేష సమయానికి మాత్రమే తమ విధులను నిర్వహిస్తారు. అంటే సదరు పంచాయతీ పాలకవర్గం సభ్యుడి మూడేళ్ల కాల పరిమితి ముగిశాక.. ఆ స్థానంలో ఎన్నికలు జరిగితే.. ఐదేళ్ల పదవీ కాలంనుంచి ఆ మూడేళ్ల పదవీ కాలం మినహాయిస్తారు. అంటే మిగిలిన రెండేళ్లకు మాత్రమే ఆ ఉప ఎన్నిక ఉంటుంది. శాసనసభ్యులకూ ఇదే వర్తిస్తుంది. అయితే మొత్తం సభకు ఇది వర్తించదు. సభ్యులకు మాత్రమే ప్రస్తుతం వర్తించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో వర్తింపజేసేందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే..

ఉమ్మడి ఏపీ (2014 తెలంగాణ, ఏపీ) అసెంబ్లీ ఎన్నికల గడువు లోక్‌సభ గడువు సరిపోవడంతో లోక్ సభకు, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుపుతున్నారు. 2009వరకు కొన్ని సార్లు మినహా ఉమ్మడి ఏపీలో, 2014లో తెలంగాణ, ఏపీలో అదే తరహా ఎన్నికలు జరిగాయి. 2018లో తెలంగాణ ప్రభుత్వం ముందస్తుకు వెళ్లడంతో నిర్ణీత సమయానికంటే 9నెలల ముందు ఎన్నికలు జరిగాయి. 1955, 1978, 1980, 1983, 1984, 1985లో ఉమ్మడి ఏపీలో మధ్యంతర ఎన్నికలు జరిగాయి. 1989లో లోక్ సభ ఎన్నికలతోపాటుగా ఎన్టీఆర్ అసెంబ్లీ ఎన్నికలకూ వెళ్లారు. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. 2004లో చంద్రబాబుకీ అదే జరిగింది.

Also Read ;- ఎన్నికల కమిషనర్ పై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు!

దేశంలో జమిలి ఎన్నికలు ఇక్కడ..

1989 సాధారణ ఎన్నికల నుంచి వేర్వేరు రాష్ర్టాల్లో 31సార్లు జమిలి ఎన్నికలు జరిగాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (1989, 1999, 2004, 2009) ఏపీ, తెలంగాణ- 2014, ఒడిశా (2004, 2009, 2014), కర్ణాటక (1989, 1999, 2004), సిక్కిం (2009, 2014), తమిళనాడు (1989, 1991, 1996), మహారాష్ట్ర (1999), అసోం (1991, 1996), హర్యానా (1991, 1996), కేరళ (1989, 1991, 1996), ఉత్తరప్రదేశ్ (1989, 1991), పశ్చిమబెంగాల్ (1991, 1996), అరుణాచల్‌ప్రదేశ్ (2009, 2014), తెలంగాణ (2014) రాష్ర్టాలు జమిలి ఎన్నికలను చూసినవే

మంచి.. చెడులు..

జమిలి ఎన్నికల ప్రతిపాదన ఎప్పటినుంచో ఉన్నా.. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పేయి హయాంలో తెచ్చిన ప్రతిపాదనను అప్పట్లో చంద్రబాబు సమర్థించారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గడం, పాలనా సౌలభ్యం ఉండడంతోపాటు కేంద్ర ప్రభుత్వాల జోక్యంతో, రాజకీయ కారణాలతో రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూలదోసే అవకాశం ఉండదు. ఒక వేళ కూలదోసినా.. శేష కాలం మాత్రమే ఆ ప్రభుత్వం అధికారంలో ఉండే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో ప్రతికూల అంశాలూ ఉన్నాయి. ఐదేళ్లవరకు తమకు ఎవరూ తొలగించలేరన్న కారణంలో ప్రభుత్వాలు నియంత విధానాలను అనుసరించవచ్చనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. దీంతోపాటు  కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎన్నుకునే విషయంలో ప్రజలు జాతీయస్థాయి అంశాలను,రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఎన్నుకునే విషయంలో స్థానిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటారని, ఒకే సారి ఎన్నికలు జరిపితే ఓటరుపై ప్రభావం ఉంటుందని చెప్పేవారూ ఉన్నారు. వెరసి జాతీయ పార్టీలకే లాభిస్తుందనే వాదనా ఉంది. మెజార్టీ కోల్పోయిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాల పరిస్థితి ఏంటనే విషయంపైనా ఇంకా చర్చ జరగాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒకే దేశం.. ఒకే ఎన్నికలు అన్న నినాదం దేశ సమాఖ్య వ్యవస్థకు భంగం కల్గిస్తుందనే వాదనాలూ ఉన్నాయి.

ఒకే ఓటరు జాబితా..

దేశమంతా వార్డు స్థాయినుంచి.. లోక్ సభ వరకు ఒకేసారి ఎన్నికలు జరగాలంటే..ఒకే ఓటరు జాబితా అవసరం ఉంటుంది. ఇదే విషయన్ని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. అది జరగాలంటే కూడా రాజ్యాంగ సవరణ అవసరం. రాజ్యాంగంలోని 243కే, 243 జెడ్‌ఏలను సవరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో గతంలో ఈసీ, లా కమిషన్‌, న్యాయ శాఖ, పంచాయతీరాజ్‌ విభాగాలు సానుకూలంగా స్పందించాయి. స్థానిక ఎన్నికల్లో ఓటర్ల జాబితా తయారీ, సవరణలు, ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ మొదలైన అంశాలపై రాష్ట్ర ఎన్నికల సంఘాలకు  అధికారమిచ్చే 243కే, 243జెడ్‌ఏ అధికరణలతో పాటు పార్లమెంటు, శాసనసభ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితా తయారీలో ఈసీకి అధికారమిచ్చేది ఆర్టికల్‌ 324(1)ను సవరించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే. ఈ మూడు అంశాలను ఒకేతాటిపైకి తెచ్చే సవరణ కావాలని చెబుతున్నారు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. ఒకే ఓటరు జాబితాకు, జమిలి ఎన్నికలకు సంబంధం లేదని గతంలో ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా వ్యాఖ్యానించడం గమనార్హం.

ముందుకే మోదీ ప్రభుత్వం..

గత ఎన్నికల్లో బీజేపీ ఒకే ఓటరు జాబితా అంశాన్ని ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్తావించింది. ఇప్పటికే దాదాపు 20 రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలే ఉండడం, కొన్ని చోట్ల బీజేపీ చెప్తే సరే అనే ప్రభుత్వాలు ఉండడంతో ఏడెనిమిది రాష్ట్రాల్లో తప్ప.. మిగతా రాష్ట్రాలన్నీ జమిలికి అంగీకరించడం ఖాయమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇప్పుడు బీజేపీకి కావాల్సిందలా రాజ్యసభలో మెజార్టీ సాధించించడం.

2015లోనే దీన్ని అమలుచేసేందుకు వ్యూహం రచించినా.. అప్పట్లో రాజ్యసభలో బీజేపీకి మెజార్టీ లేకపోవడంతో వెనక్కి తగ్గింది. భాజపాకు లోక్​సభలో స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ రాజ్యసభలో ఇంకా బలం కావాలి. ప్రస్తుతం బీజేపీతో పాటు మిత్ర పక్షాలకు దాదాపు 102 మంది సభ్యుల బలం ఉంది. ఈ సవరణలు జరగాలంటే 2/3 వంతు మెజార్టీ కావాలి. అంటే 163 మంది సభ్యుల బలం కావాలి. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలతోపాటు మరికొన్ని పార్టీలను ఒప్పిస్తే.. (CAA బిల్లు తరహాలో) మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదింపజేసుకునే వెసులుబాటు ఉంది. తరువాత ఈ అంశంపై దేశంలోని సగం రాష్ట్రాల ఆమోదం పొందాలి. అంటే ప్రస్తుతం 15 రాష్ట్రాల్లోని శాసనసభలు అంగీకారం తెలపాల్సి ఉంటుంది.  ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీల మద్దతును కూడగట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది.

Also Read ;- ప్రభుత్వానికి పక్కలో బల్లెం నిమ్మగడ్డ

Don’t miss it ;- జగన్ దళానికి జమిలీ దెబ్బ పడుతుందా!!

Tags: 2021 west bengal legislative assembly electionaam admi partybengal elections 2021chandra babu naiduchief election commissioner of india sunil aroraconstitutional amendmentgst implementationjamili electionsleotopmodi one nation one election pitchnarendra modi dual electionsprime minister atal bihari vajpayeerajya sabhashiv sena partytelangana governmenttelugu news
Previous Post

పొలిటికల్ లీడర్ గా అల్లు అర్జున్?

Next Post

గర్భ స్రావం కు గురై తల్లడిల్లారు

Related Posts

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

by లియో డెస్క్
May 11, 2026 5:53 pm

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి రోజా తాజాగా టీవీ-9 ఇంటర్వ్యూలో చేసిన...

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

by లియో డెస్క్
May 11, 2026 4:17 pm

వైసీపీ మహిళా నేతలలో రగడ మొదలయిందా..? ఒకరిపై ఒకరు రాజకీయాలు మొదలు పెట్టారా..?...

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

by లియో డెస్క్
May 8, 2026 3:19 pm

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో మరో కీలక అడుగు పడింది. ఐకానిక్ మోటార్ సైకిల్...

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

by లియో డెస్క్
April 29, 2026 7:29 pm

తన కాన్వాయ్‌పై జరిగిన దా*డిపై తీవ్రంగా స్పందించారు మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి...

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

by లియో డెస్క్
April 25, 2026 3:45 pm

ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్...

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

by లియో డెస్క్
April 24, 2026 5:09 pm

ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.. చేసి చూపిస్తున్నారు. అభివృద్ధిలో ఏపీని దేశంలోనే నెంబర్‌...

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

by లియో డెస్క్
April 24, 2026 2:21 pm

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన పరిటాల రవి, వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసుల...

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

by లియో డెస్క్
April 23, 2026 7:14 pm

ఎర్ర బస్సులన్నీ.. ఏసీ బస్సులయితే.. సిటీ సర్వీసుల్లో ఎయిర్‌ కండిషన్‌ సౌకర్యం ఉంటే.....

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

by లియో డెస్క్
April 23, 2026 6:35 pm

రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి బూస్ట్‌ ఇచ్చే మరో పరిశ్రమ ఏపీకి వచ్చింది. అనకాపల్లి...

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

by లియో డెస్క్
April 23, 2026 6:07 pm

వైసీపీ MLC అనంతబాబు మరోసారి వార్తల్లోకెక్కారు. దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హ*త్య...

Load More

ఎక్కువ మంది చదివిన కధనాలు

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

Hot Beauty Prajakta Dusane looking beautiful in red dress

ట్విట్టర్ లోకి ‘నిశ్శబ్దం’గా ఎంటరైన స్వీటీ .. !

సంక్రాంతి పైనే కన్నేసిన ‘బంగార్రాజు’

అనుకుంటే అరెస్టే!.. ప్రోసీజ‌ర్ పాటించం!

చంద్రబాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

ముదురుతున్న ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ వివాదం

ఏపీ పారిశ్రామిక విధానం – అన్నీ కోతలే

ముఖ్య కథనాలు

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సంపాదకుని ఎంపిక

జగన్ పై యుద్థం ప్రకటించిన రఘురామ..! హైకోర్టులో మరో పిటిషన్..!

అసుర పిన్నెల్లి దహనం.. మార్పు కోరుకుంటున్న మాచర్ల..!

పేదోడి ప్రాణం, చావుకు ఖరీదా..? ఎందుకింత దారుణం..?

గర్జిస్తున్న సింహపురిలో సింహాలు..వణికిపోతున్న వైసీపీ..!

రోజాపై పలు స్టేషన్ లో కేసులు..!

నిరసనలతో హోరెత్తుతున్న తెలుగు రాష్ట్రాలు..!

సుప్రీం సంచలన నిర్ణయం..చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..!

జైల్లో చంద్రబాబుపై స్టెరాయిడ్స్ ప్రయోగం..!

బిగ్ బ్రేకింగ్ .. ప్రమాదపు అంచుల్లో చంద్రబాబు ఆరోగ్యం..!

పంచాయతీలు విధ్వంసం.. సర్పంచ్ లు సర్వనాశనం..!

రాజకీయం

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

సినిమా

జగన్‌ని టెన్షన్‌ పెడుతున్న గుంటూరు జిల్లా మంత్రి..!

రాజకీయాలకు బ్రేక్… బుల్లితెర ఇన్నింగ్స్ షురూ.. రోజా కొత్త షో అట్టర్ ఫ్లాప్..??

బుగ్గన అబద్ధాల బుగ్గ పగిలింది… హైలీ రెస్పెక్టెడ్‌ రెడ్డి గారికి సోషల్‌ వాతలు…!!

మొత్తం ఆయనే చేయించాడు… సజ్జల భార్గవ్‌పై ఫిర్యాదుల వెల్లువ…!!

నిన్న టాటా, నేడు రిలయన్స్.. ఏపీకి కొత్తగా రూ.65 వేల కోట్ట పెట్టుబడి

పవన్‌ – అమిత్‌ షా భేటీ సీక్రెట్‌ ఇదే..??

దేవర సక్సెస్‌ వెనక ఏపీ సర్కార్‌ జీవో….!!

నటి ప్రభ కుమారుడి వివాహ వేడుకలో సినీ సందడి

50 ఏళ్ల నటజీవితం.. మురళీమోహన్ కు ఘన సత్కారం

బబుల్ గమ్ మూవీ రివ్యూ

బాక్సాఫీసు వద్ద ప్రభాస్ ప్రభంజనం

జనరల్

అమరావతి,మావిగన్‌ ఒకటే.. వైసీపీకి షాకిచ్చిన రోజా.!

శ్యామలని ఎత్తిపడేసిన రోజా, రజిని..?

ఏపీకి రాయల్‌ ఎన్‌ఫీల్డ్..రూ.2500 కోట్ల పెట్టుబడి..!

మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిపై దా*డి వెనుక పిన్నెల్లి సోదరులు..!

ఏపీ లిక్కర్ స్కామ్.. జగన్ కోటరీపై ఈడీ పంజా..!

హైదరాబాద్‌ నుంచి ఏపీకి.. రివర్స్‌ మైగ్రేషన్‌..! బాబు సర్కార్ సూపర్ ..!

పరిటాల, వివేకా హ*త్యల రూట్‌లో అనంతబాబు టీమ్..స్కెచ్ ఇదే…!

ఆర్టీసీ బస్సుల్లో ఏసీ.. సీఎం చంద్రబాబు సంచలనం..

ఉత్తరాంధ్రలో భారీ ప్రాజెక్ట్‌.. అనకాపల్లి దశ – దిశ మార్చనున్న రీన్యూ కంపెనీ..

బరితెగించిన అనంతబాబు.. సాక్షులను కొనేందుకు ప్లాన్..!

An initiative by

  • About Us
  • Subscribe
  • Advertise with us
  • Contact Us
  • Search
Contact us: feedback@theleonews.com
Terms and Conditions | Privacy Policy

Follow us on social media:

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

No Result
View All Result
  • లియో హోమ్
  • రాజకీయం
    • ఆంధ్ర ప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమా
    • టాలీవుడ్
    • కోలీవుడ్
    • మాలీవుడ్
    • శాండల్ వుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
  • జనరల్
  • సంపాదకీయం
  • విశ్లేషణ
    • తిరుమల
    • దాసరి అల్వార్ స్వామి
  • సినీ సమీక్ష
  • గ్యాలరీలు
    • జనరల్
    • సినిమా
  • మహిళ
  • సంస్కృతి
    • కళలు
    • సాహిత్యం
    • ఆధ్యాత్మికం
  • ఎన్నారై
  • ప్రెస్ నోట్స్

© 2023 The Leo News - A collabrative News Platform designed by Team Leo

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
The Leo News | Telugu News

Add New Playlist