మెగాస్టార్ చిరంజీవి అంటే రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కి ఎంతో ఇష్టం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘శంకర్ దాదా ఎంబీబీఎస్, అందరివాడు, శంకర్ దాదా జిందాబాద్, ఖైదీ నెంబర్ 150’ తదితర చిత్రాలు మ్యూజికల్ హిట్స్ గా నిలిచాయి. చిరు మూవీ అంటే చాలు దేవిశ్రీ అదిరిపోయేలా మ్యూజిక్ ఇస్తుంటాడు. అయితే.. దేవిశ్రీ ఈమధ్య కెరీర్ లో కాస్త వెనకబడ్డాడు. ఈ కారణం చేతనో లేక ఏమో కానీ.. చిరు, కొరటాల మూవీ ఆచార్యకు దేవిశ్రీని కాకుండా మెలోడి బ్రహ్మ మణిశర్మని ఎంచుకున్నారు.
అయితే.. దేవిశ్రీ ‘ఉప్పెన’ సినిమాకి ఇచ్చిన సంగీతం అదిరింది. సినిమా రిలీజ్ కాకుండా.. బ్లాక్ బస్టర్ అనేంత టాక్ తెచ్చుకుంది అంటే కారణం పాటలకు దేవిశ్రీ అందించిన సంగీతం అని చెప్పచ్చు. అందుకనే అనుకుంట రాక్ స్టార్ దేవిశ్రీకి మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చింది. చిరంజీవి బాబీ డైరెక్షన్ లో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. దీనికి సంగీతం అందించే బాధ్యతను దేవిశ్రీకి ఇచ్చేందుకు చిరు ఇంటికి పిలిచారని తెలిసింది.
ఇప్పటికే బాబీ – దేవి మధ్య సంగీత చర్చలు మొదలైపోయిందని టాక్ వినిపిస్తోంది. ఈ మూవీ పక్కా మాస్ అనేలా ఉంటుందట. ఇంకా చెప్పాలంటే.. ‘ముఠామేస్త్రి, రౌడీ అల్లుడు’ తరహాలో ఉంటుందట. దీనికి అదిరిపోయే మ్యూజిక్ అందించడానికి దేవిశ్రీని ఎంచుకున్నారు. ప్రస్తుతం ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్న చిరంజీవి ఆ తర్వాత ‘లూసిఫర్’ రీమేక్ స్టార్ట్ చేయనున్నారు. ఆతర్వాత బాబీతో సినిమా పట్టాలెక్కించనున్నారని సమాచారం.
Also Read ;- చిరంజీవి తీసుకున్న కేర్ వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను