ఏపీలోని విశాఖపట్నం జిల్లాలో దారుణం జరిగింది. పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురయ్యారు. విజయవాడకు చెందిన కుటుంబం కొన్నేండ్లుగా జుత్తాడలో ఉంటున్నారు. పక్కన ఉన్న మరో కుటుంబంతో తరచుగా గొడవలు జరిగేవి. పాత కక్షలతోపాటు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో బత్తిన అప్పలరాజు అనే వ్యక్తి గురువారం మాటు వేసి కిరాతంగా ఆరుగురిని నరికాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతూ ఆరుగురి ప్రాణాలు విడిచారు. మృతుల్లో మూడేళ్ల, ఐదేళ్ల చిన్నారులు ఇద్దరు ఉన్నారు. హత్యా ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. హత్యకు పాల్పడ్డ నిందితుడు పరారీలో ఉన్నాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నిందితుడిని పట్టుకున్నారు. ఆస్తి తగాదాల వల్లే హత్యలు జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో సంఘటనలో…
విశాఖ నగరం మధురవాడ మిథిలాపురి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లో ఓ ఎన్ఆర్ ఐ కుటుంబం ఉంటుంది. కుటుంబంలోని నలుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మిస్టరీగా మారింది. మిథిలాపురి కాలనీలోని ఆదిత్య టవర్స్ లో ఎన్ఆర్ఐ కుటుంబం ఎనిమిది నెలలుగా నివసిస్తోంది . అయితే వారి ఇంటి నుండి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో మంటల ధాటికి నలుగురు సజీవ దహనం అయ్యారు అని తెలుస్తుంది. అయితే వీరిని హతమార్చి, సజీవదహనం చేసినట్లుగా అనుమానిస్తున్న పోలీసులు ఆ దిశలో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మొదట దీనిని అగ్ని ప్రమాదంగా భావించినా , తర్వాత రక్తపు మరకలు ఉండటంతో పక్కాగా ప్లాన్ చేసి మరీ చేసిన హత్యలుగా అనుమానించారు.
Must Read ;- వంద కోసం హత్య.. బెజవాడలో రెచ్చిపోయిన బ్లేడ్ బ్యాచ్