ప్రతికలు వాటి సహజమైన రూపాన్ని కోల్పోయి రాజకీయ పార్టీలకు అండగా నిలిచే సాధనాలుగా మారిపోయాయి. ఇది రాజకీయ వ్యూహాల్లో భాగమైన కావొచ్చ, లేదా, వ్యాపార వ్యూహాల్లో భాగమైనా కావొచ్చు. రాజకీయ పార్టీ- దినపత్రిక అనే రెండు వ్యవస్థలు.. రెండూ కూడా ప్రజాస్వామ్యానికి మూలు స్తంభాలుగా పరిగణనలో ఉన్న వ్యవస్థలు.. ఒక దానికి ఒంటి అండగా ఉండడం రివాజుగా మారిపోయింది.
అయితే ఇలాంటి సిద్ధాంతీకరణలో లోపం కనిపించకపోవచ్చు గానీ.. తాము కొమ్ము కాస్తున్న పార్టీకి భజన చేయడానికి, అదే క్రమంలో ఇతర పార్టీల మీద విషం చిమ్మడానికి ప్రతికలు తయారైపోతున్నాయి.
ఇదంతా కూడా ఒక ఎత్తు గానీ.. తాము అనుకూలగా ఉండే రాజకీయ పార్టీ ప్రయోజనాల కోసం వ్యాపారాన్ని కూడా కాదనుకుని పనిచేయడం ఇవాళ్టి పత్రికలు కొన్ని అనుసరిస్తున్న కొత్త ట్రెండ్. పార్టీ అధినేతలో పత్రికలకు కూడా యజమానులు కావడం వలన వచ్చిన పోకడ ఇది.
తాజాగా సమాచారం ఏంటంటే జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో.. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పత్రికలను నగరంలోని అనేక డివిజన్లలో అపార్ట్ మెంట్లలో ఉచిత కాపీలు పంచిపెడుతున్నారట. ప్రతి డివిజన్ కు కనీసం ఐదు వేల కాపీలను ఉచితంగా పంచేస్తున్నారని తెలుస్తోంది. పత్రికలను ఇళ్లకు చేర్చవలసిన హాకర్ల పరిస్థితి ఏమిటి. అందుకు వారు మార్గం చూశారు. తాము పత్రికను అమ్మడం లేదు గానీ.. హాకర్లకు మాత్రం ఒక్కో కాపీకి రెండు రూపాయల వంతున ముట్ట జెబుతున్నారట. ఈ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే రెండు పత్రికలు కూడా స్వయంగా కేసీఆర్ కు చెందినవే కావడం విశేషం. దాంతో నగర బల్దియా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వారు వ్యాపారాన్ని కూడా కాదనుకుని ప్రచారానికి దిగారు.
గతంలో సాక్షి కూడా ఇంచుమించు ఇదే తరహాలో పనిచేసింది. ఏపీలో అనేక నగరాల్లో సాక్షి దినపత్రికకు చందాలు కట్టినా కట్టకపోయినా.. కొన్ని కాలనీల్లో ప్రతి ఇంటిలోనూ ఉదయాన్నే పేపర్ పడిపోయేది. నెలగడిచినా.. నెలలు గడిచినా చందా సొమ్ముల కోసం ఎవ్వరూ వచ్చేవారు కాదు. అలా ఉచితంగా పత్రిక ఇళ్లకు వచ్చేసేది. యజమాని జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధినేత గనుక.. ఆయనను ముఖ్యమంత్రి చేయడానికి ఆ పత్రిక ఆ రకంగా పాటు పడింది. ఇప్పుడు అలాంటి ఉచిత పంపిణీలు ఆపేశారు.
సో, నిన్న సాక్షి నడిచిన బాటలోనే.. నేడు నమస్తే తెలంగాణ కూడా నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఇలాంటి ప్రయత్నాలు వారికి విజయాన్ని కట్టబెడతాయో లేదో చూడాలి.
Must Read ;- షాక్ : ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడో ఆగిపోయింది!?