ఆటలో గెలుపు, ఓటములు సహజం. కానీ ముంబై ఇండియన్స్ చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిన తీరుపై అభిమానులలో ఆందోళన నెలకొంది. పేలవ బౌలింగ్ తో ముంబైకు 208 పరుగులు సమర్పించుకున్న హైదరాబాద్, బ్యాటింగ్ లో 174 పరుగులకే పరిమితమైంది. వార్నర్ మినహ ఇతర ఆటగాళ్లు రాణించకలేకపోవడంతో హైదరాబాద్ ఈ టోర్నీలో మూడవ ఓటమిని మూటగట్టుకుంది. కీలక ఆటగాళ్లు బెయిర్ స్టో, విలియమ్సన్ లు ఫామ్ లో లేకపోవడం హైదరాబాద్ జట్టు ఓటమికి కారణమైంది.
ముందే ఊహించిన వార్నర్
సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఈ సీజన్ పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. సీజన్ ప్రారంభంలోనే విలియమ్సన్ గాయంతో మొదటి రెండు మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఇదే సమయంలో భారీ రేటు చెల్లించి కొనుకున్న ఆసీస్ ఆల్ రౌండర్ షాన్ మార్ష్ గాయపడటం హైదరాబాద్ కోలుకోలేని దెబ్బ తీసింది. మడమ నొప్పితో విలవిలాడిన మార్ష్ పూర్తిగా టోర్నీ నుంచి నిష్క్రమించారు. మార్ష్ తప్పుకోవడంతో షాక్ లో ఉన్న హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి భువనేశ్వర్ రూపంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కండరాల నొప్పితో భువి ముంబై మ్యాచ్ కు దూరమయ్యారు. ఇలా వరుస ఆటగాళ్లు దూరం కావడం హైదరాబాద్ జట్టును కష్టాల్లోకి నెట్టింది.
కీలక ఆటగాళ్లు గాయాల భారిన పడటంతో హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. మాకే ఎందుకు ఇలా జరుగుతుందని వార్నర్ కామెంట్ చేశాడు. బెంచ్ స్ట్రెంగ్త్ బలంగా లేకపోవడంతో వీరి స్థానాలలో వచ్చిన ఆటగాళ్లు రాణించలేకపోతున్నారు. భువీ స్థానంలో వచ్చిన సిద్దార్థ్ కౌల్ 4 ఓవర్లలలో ఏకంగా 64 పరుగులు ఇవ్వడం గమనార్హం. మార్ష్ స్థానంలో వచ్చిన అబ్దుల్ సమద్ కూడా అంచనాల అనుగుణంగా రాణించలేకపోతున్నారు. వీరిని ద్రుష్టిలో పెట్టుకొనే వార్నర్ . మాకే ఎందుకు ఇలా జరుగుతుందని కామెంట్ చేశారని వార్తలు వినబడుతున్నాయి.
జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించకపోతే ఈ సీజన్ పై హైదరాబాద్ ఆశలు వదులుకోవలసిందే…!