సంక్రాంతికి రిలీజైన సినిమాలకు ప్రేక్షకుల నుంచి విశేషాదరణ లభించడం.. థియేటర్లో సిటింగ్ కెపాసిటీని పెంచేందుకు కేంద్రప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో భారీ చిత్రాలు థియేటర్లోకి వచ్చేందుకు క్యూకడుతున్నాయి. దాదాపుగా భారీ చిత్రాల రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేసేశారు. అయితే.. ప్రభాస్ ‘రాధేశ్యామ్, విజయ్ దేవరకొండ ’లైగర్’ సినిమాల రిలీజ్ డేట్స్ మాత్రం ఎనౌన్స్ చేయలేదు.
రిలీజ్ డేట్ పక్కన పెడితే.. సంక్రాంతికి ‘రాధేశ్యామ్’ టీజర్ వస్తుంది అనుకున్నారు రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలియచేస్తూ అప్ డేట్ కూడా ఇవ్వకపోడంతో సోషల్ మీడియాలో ఈ చిత్ర నిర్మాణ సంస్థ పై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఇంకా స్టార్ట్ కాని ‘సలార్, ఆదిపురుష్’ నాగ్ అశ్విన్ మూవీస్ కి సంబంధించి అప్ డేట్ లు వస్తున్నాయి కానీ.. దాదాపుగా షూటింగ్ చేసుకున్న ‘రాధేశ్యామ్’ కి సంబంధించి అప్ డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు మండిపడుతున్నారు.
తాజా వార్త ఏంటంటే.. ‘రాధేశ్యామ్’ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది పాన్ ఇండియా మూవీ కాబట్టి బాలీవుడ్, కోలీవుడ్ లో సినిమాల రిలీజ్ డేట్స్ కూడా చూసుకోవాలి. ప్రస్తుతం మూడు డేట్ల ను ‘రాధేశ్వామ్’ యూనిట్ పరిశీలిస్తోంది. ఈ మూడింటిలో ఒకదాన్ని వీలైనంత త్వరగా ప్రకటించాలి అనుకుంటోందని సమాచారం. ఇక ‘లైగర్’ విషయానికి వస్తే.. ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కూడా త్వరలోనే ఎనౌన్స్ చేస్తారని టాక్.
Must Read ;- అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మల్టీస్టారర్ మూవీ?