తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో ప్రభుదేవాకి విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ మూడు భాషలలోని ప్రేక్షకులను ఆయన ప్రభావితం చేశాడు. చూస్తుండగానే నటుడిగా 53 సినిమాలను పూర్తిచేశాడు. 54వ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమా పేరే ‘పొయిక్కల్ కుతిరాయ్’. తమిళంలో వినోద కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి, సంతోష్ జయకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.
ఒక చిన్న పిల్లను శత్రువుల బారి నుంచి కాపాడే ప్రయత్నంలో ప్రభుదేవా ఉన్నాడు. అయితే ఆయనకి ఒక కాలు లేదు. ఆర్టిఫీషియల్ కాలుతో నడిచే ఆయన, తనని చుట్టుముట్టిన శ్రతువులను ఎలా ఎదిరించాడనే కుతూహలం ఈ పోస్టర్ చూసిన ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. అయితే అసలు ఆ పాప ఎవరు? ఎవరి అధీనంలో ఉంది? ఎవరి బారి నుంచి హీరో ఆమెను కాపాడాలని అనుకుంటున్నాడు అనేదే సస్పెన్స్.
ప్రస్తుతం ఈ సినిమా .. షూటింగు దశలో ఉంది. ఇప్పటికే 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశారు. మిగతా చిత్రీకరణ సాధ్యమైనంత త్వరగా జరుగుతుందని అంటున్నారు. రైజా విల్సన్ కథానాయికగా కనిపించనున్న ఈ సినిమాలో, వరలక్ష్మీ శరత్ కుమార్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తోంది. ఇమాన్ సంగీతం ఈ సినిమాకి హైలైట్ గా నిలవనుందని చెబుతున్నారు. పాత్రల పరంగా ప్రకాశ్ రాజ్ – సముద్రఖని ఈ సినిమాలో పోటీపడతారట.
Must Read ;- ‘పుష్ప’ ఫస్టుసాంగు రిలీజుకు ముహూర్తం ఖరారు!