పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్ లో రూపొందుతోన్న భారీ పిరియాడిక్ మూవీ రాధేశ్యామ్. యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సాహో సినిమాతో ఆశించిన స్ధాయిలో సక్సస్ సాధించకపోవడంతో ప్రభాస్ అభిమానులు రాధేశ్యామ్ మూవీ పై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ అండ్ టీజర్ అంచనాలను పెంచేసింది.
అయితే.. ఈ మూవీ అప్ డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ.. నిర్మాణ సంస్థ ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. సంక్రాంతికి అప్ డేట్ వస్తుంది అనుకున్నారు కానీ.. రాలేదు. ఇదిలా ఉంటే.. కరోనా కారణంగా థియేటర్లో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్ ఇచ్చిన కేంద్రప్రభుత్వం ఇప్పుడు ఆక్యుపెన్సీని పెంచడం.. త్వరలోనే 100 శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ రాబోతుందని తెలియడంతో వరుసగా భారీ చిత్రాలు థియేటర్లోకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి.
అంతే కాకుండా భారీ చిత్రాల రిలీజ్ డేట్లు కూడా ఎనౌన్స్ చేస్తున్నారు. అయితే.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ గురించి మాత్రం ఈ చిత్ర నిర్మాతలు సైలెంట్ గానే ఉన్నారు తప్పా.. విడుదల ఎప్పుడు అనేది ప్రకటించలేదు. కారణం ఏంటంటే.. భారీ పిరియాడిక్ మూవీ. విఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ కంప్లీట్ అయ్యింది అయితే.. విఎఫ్ఎక్స్ వర్క్ పెండింగ్ లో ఉందట. అది పూర్తైతే రిలీజ్ ఎప్పుడు అనేది ప్రకటిస్తారట. అందుకే రాధేశ్యామ్ నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారని సమాచారం. మరి.. విఎఫ్ఎక్స్ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో..? రిలీజ్ డేట్ పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.
Must Read ;- ‘రాధేశ్యామ్’ గురించి అన్ని విషయాలు బయటపెట్టిన రెబల్ స్టార్