కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని బేగంపేటలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా ఎలా ఆపుతారని ప్రశ్నించారు. ‘‘లోకల్ ఎంపీ నీ, ప్రజలు కష్టాల్లో ఉన్నరు, వాళ్లకి సహాయం చేయడానికి వెళ్తుంటే మీరు నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారు‘‘ అని పోలీసులను నిలదీశారు. ఓ హస్పిటల్ కు జనరేటర్ ను ఇవ్వడానికి వెళ్తున్నానని, అలాగే కరోనా రోగులకు ఉచిత భోజనం అందిస్తున్నానని పోలీసులకు వివరణ ఇచ్చినా.. రేవంత్ రెడ్డి వాహనాన్ని అడ్డుకోవడం చర్చనీయాంశమైంది. లాక్డౌన్ సమయంలో తిరిగేందుకు అనుమతి లేదంటూ.. పోలీసుల ఆయనతో వాదనకు దిగారు.
గాంధీ ఆస్పత్రి వద్ద వేలాది రోగులకు నిత్యం అన్నదానం కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే రెండోరోజు పంపిణీకి వెళ్తున్న ఆయనను అడ్డుకొని, పోలీసులు ఉచిత భోజనాన్ని బంద్ చేయించారు.
Must Read ;- కరోనా రోగులకు అండగా.. కాంగ్రెస్,రేవంత్