ఆర్జీవీ మీద ఎంత కసి ఉంటే అర్ధరాత్రి పాట విడుదల చేస్తారు. మొత్తానికి కసితోనే ఈ పాటను విడుదల చేసినట్టుంది. కార్తికేయ చిత్రనిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీకార్ప్ సమర్పణలో, ప్రముఖ సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు దర్శకత్వంలో, మాగ్నస్ సినీప్రైమ్ పతాకంపై బాల కుటుంబరావు పొన్నూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రోజూ గిల్లే వాడు’ పేరుతో దీనికి ఓ ట్యాగ్ లైన్ కూడా ఉంది. ఈ సినిమాలోని రెండో పాట లిరికల్ వీడియోని, ఆదివారం అర్ధరాత్రి, మణికొండ మర్రిచెట్టు కింద, తెలుగువన్ ఛానల్ చైర్మన్ రవిశంకర్ విడుదల చేశారు. ఈ సినిమాలోని మొదటి పాట విడుదలైన రెండు వారాల్లోనే యూట్యూబ్ లో 20 లక్షలమందికి పైగా విని ఆనందించారు. తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చిన తెలుగు సినీపరిశ్రమనే అవమానిస్తున్న ‘తగుల్భాజీ దర్శక దయ్యం”నమక్ హ రాం’ఘోపాలవర్మకి ఈ రెండో పాటని అంకితం ఇచ్చినట్లు కవి,దర్శకుడు జొన్నవిత్తుల తెలిపారు. చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం మాట్లాడుతూ కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే మిగిలిన చిత్రీకరణ పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. నటీనట వర్గం: సురేష్, రాశి, శ్రద్ధా దాస్, అమిత్, తేజ తదితరులు.
పుష్ప 2 అప్డేట్స్ ఇవేనా ?
అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మవవీగా రికార్డు సృష్టించిన...