వైసీపీ ఏలుబడిలో ప్రతి గ్రామం మరో రణస్థలమే!
గత ఏడాది జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో అధికార వైసీపీ సర్పంచ్ అభ్యర్థులను ఓడించారని, తమ పార్టీకి ఓటు వేయలేదని కక్ష కట్టి మరి ప్రజలపై దాడులకు తెగపడున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఓటు హక్కు తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని నీచ రాజకీయాలకు పాల్పడే వైసీపీకి గత ఏడాది జరిగిన లోకల్ ఎన్నికల్లో ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు. ఈ ఓటమిని జీర్ణించుకోలేని అధికారపార్టీ ప్రజలపై కక్ష కట్టారు. ఏపీలో సర్పంచ్ ఎన్నికలు జరిగి దాదాపు ఏడాది కావస్తున్నా.. ఆ పరాజయ ఛాయలు వారిని వీడినట్లు లేదు కాబోలు! నిత్యం ఓటు వేయని ప్రజలను, ప్రతిపక్షాల ప్రతినిధులను పీడిస్తునే ఉన్నారు. గుంటూరు జిల్లా నగరం మండలంలోని పెద్దవరం గ్రామంలో వైసీపీ అరాచకానికి పెట్టింది పేరుగా మారింది. వైసీపీ సర్పంచ్ అభ్యర్థి రాజ్ కుమార్ నాయకత్వాన్ని తిరస్కరించి.. టీడీపీ సర్పంచ్ అభ్యర్థి హరేరామ్ కు ప్రజలు పట్టం కట్టారు. దీనిని మనసులో పెట్టుకుని అధికార వైసీపీ ప్రతికారేచ్ఛతో పచ్చని పల్లెలో చిచ్చు రాజేస్తున్నారు. టీడీపీ మద్దతు దారులను లక్ష్యంగా చేసుకుని ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ఇళ్లు, పొలంలోని వరి కుప్పులు, గడ్డివాములను మూకుమ్మడిగా నిప్పుపెట్టారు. నోటికాడి కూడు, ఉపాధినిచ్చే వాహనాలు అగ్నిలో దగ్థమౌతుంటే కడుపు తరుక్కుపోతోందని బాధితులు రోధిస్తున్నారు! ఇలా గ్రామంలో మొత్తం 18 మంది టీడీపీ మద్దతుదారుల వరికుప్పలను మూకుమ్మడిగా దగ్థం చేశారు. రాజ్ కుమార్ ప్రోద్బలంతో ఉయ్యూరు రాంబాబు, రామాంజనేయులు తదితరులు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని టీడీపీ సర్పంచ్ హరేరామ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ అధికార పార్టీ నేతల అండదండలతో ఎటువంటి కేసు నమోదు చేయకుండా వదిలేశారు. ఎటువంటి చర్యలుకానీ, కనీసం విచారణ కానీ చేయకుండా కేసును క్లోజ్ చేశారు. దీంతో హరేరామ్ రూరల్ ఎస్పీకి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. న్యాయం చేయాలని వేడుకుంటుంన్నారు.
పల్లెల్లో బతకలేం.. పొరుగు రాష్ట్రాలకు వలసపొతాం!
వైసీపీ పాలనలో దౌర్జన్యాలు నింగినంటుతున్నాయి. పల్లెల్లో దాష్టికాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులొస్తున్నా.. ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ‘‘అధికారంలో ఉన్నవారికే న్యాయం.. సామాన్యులకు అన్యాయం’’ అన్నట్లు పోలీసుల తీరు విస్మయానికి గురిచేస్తోంది. లా అండ్ అర్డర్ ను నియంత్రించాల్సిన సిస్టమ్ సైలెంట్ గా ఉంటే రాష్ట్రంలో అరాచకం పెచ్చురిల్లుతోంది. అధికార పార్టీకి న్యాయం.. సామాన్యులకు అన్యాయమనే టాగ్ లైన్ తగిలించుకుని ఏపీలో పోలీసులు కలంకితులుగా ముద్రవేసుకున్నారన్నది బహిరంగ రహస్యమే! ప్రజల మాన, ప్రాణాలకు భద్రత కల్పించాల్సిని పోలీసు వ్యవస్థ నీచ రాజకీయాలకు ఊడిగం చేస్తోంది! కట్టు బానిసలు మాదిరిగా డ్యూటీలు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారపార్టీ నేత ఎటువంటి నేరాలకు పాల్పడిన, దౌర్జన్యాలకు దిగిన కేసు లుండవు! ప్రాణాలు తీస్తున్నా, ప్రాణ హాని ఉందని బాధితులు ఫిర్యాదు చేసిన ఎటువంటి కేసులు నమోదు కావు!! ఇలా రాష్ట్రంలో పోలీసులను అడ్డంపెట్టుకుని అరాచక పాలన సాగిస్తోంది వైసీపీ! అంతిమంగా పల్లెల్లో బలకలేమని.. పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారు బాధితులు!