తండ్రి మరణంతో నటి లక్ష్మీరాయ్ తల్లడిల్లిపోతోందట. ఆమె తండ్రి రామ్ రాయ్ నిన్న శనివారం కన్నుమూశారు. తండ్రి మరణం ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేసిందట. తన బాధను ఎవరితో పంచుకోవాలి. అందుకే ట్విట్టర్ తో పంచుకుంది.. ట్వట్టర్ లోనే పంచుకుంది. ఇన్ స్టాగ్రామ్ కూడా దీనికి వేదికైంది. దాంతో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆమె బాధే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా ఆమె తండ్రితో గడిపిన జ్ఞాపకాల ఫొటోలే కనిపిస్తున్నాయి.
లక్ష్మీరాయ్ అనగానే మనకు పొడుగు పాప గుర్తొకు వస్తుంది. తెలుగులో అధినాయకుడు, వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మీ, కాంచన తదితర చిత్రాల్లో నటించింది. ‘డాడీ ఐ మిస్ యూ.. మిమ్మల్ని కాపాడుకోలేకపోయా. ఈ లోటుతోనే బతకడానికి ప్రయత్నిస్తా. మీరు ప్రేమించినంతగా ఎవ్వరూ నన్ను ప్రేమించలేదు. నా గుండె ముక్కలవుతోంది. మిమ్మల్ని ఎంత కాపాడుకుందామనుకున్నా నావల్ల కాలేదు. ఇక నా జీవితం చీకటి మయమే. మీరు లేకపోతే నన్ను నడిపించే వారెవరు? నేను స్వేచ్ఛగా బతకాలని మీరు కోరుకున్నారు.
మీరు గర్వపడేలా నేనుంటా. మీ కోరికలన్నీ నెరవేరుస్తా. మీరు నాతోనే ఉన్నారని భావిస్తా. పైనుంచి మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయి. మిమ్మల్ని మేం మిస్ అవుతున్నాం.. ఐ లవ్ యూ’ ఇలా రాయ్ లక్ష్మీ తన ఆవేదనను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది. ఆమె భావోద్వేగానికి చాలామంది చలించారు. సోషల్ మీడియా వేదికగానే ఆమెను ఓదార్చారు. లక్ష్మీరాయ్ తెలుగులో తక్కువగానే సినిమాలు చేసినా తమిళంలో మాత్రం ఎక్కువ సినిమాలే చేసింది.