ఎస్ ఈసీనే కదా ఏమన్నా పడుంటుంది.. ఏది మాట్లాడినా చెల్లుబాటవుతుంది.. అనే రోజులకు కాలం చెల్లింది. మాటలు పడడానికి ఏం మాత్రం సిద్ధంగా లేనని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాటలతో కాదు.. తన చేతలతో చూపిస్తున్నారు. చిత్తూరు జిల్లా తన జమానానా ఫీలవుతూ.. ఏకగ్రీవాలను తాత్కాలిక బ్రేక్ వేసరనే కోపంతో.. నోటికి ఎంతొస్తే అంత ఎన్నికల కమిషన్పై అవాకులు చవాకులు పేలిన పెద్దిరెడ్డిపై కొరడా ఝులిపించారు నిమ్మగడ్డ.
ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్నికల కమిషన్ని తిడుతూ, దుర్భాషలాడిన పెద్దిరెడ్డిపై ఎస్ఈసీ చర్యలకు ఉపక్రమించింది. పెద్దిరెడ్డిని ఈ నెల 21వ తేదీ వరకు ఇంటికే పరిమితం చేయాలని.. మీడియా సమావేశాలు పెట్టకుండా చూడాలనీ.. డీజీపీని ఎన్నికల కమిషన్ ఆదేశించారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వక ఆర్టర్స్ కూడా విడుదల చేశారు. కాగా, ఇప్పటి వరకు తనకు ఆదేశాలు అందలేదని డీజీపీ వెల్లడించినట్లు సమాచారం.
Must Read ;- మంత్రి పెద్దిరెడ్డి బరితెగింపునకు పరాకాష్ట











