వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షులుగా ఉన్న దస్తగిరి, రంగన్నలకు భద్రతలో భాగంగా గన్మెన్ల సౌకర్యం కల్పించారు.కడప జిల్లా కోర్టు ఆదేశాల మేరకు ఒన్ ప్లస్ ఒన్ గన్ మెన్లను పోలీసుశాఖ కేటాయించింది. మరోవైపు కేసులో ఏ5 నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వరాదంటూ.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత రెడ్డి హైకోర్టులో అనుబంధ పిటీషన్ దాఖలు చేశారు. తన వాదనలను వినిపించేందుకు కూడా అవకాశం ఇవ్వాలని ఆమె హైకోర్టును అభ్యర్థించారు. ఈ అంశంలో జరిగిన వాదనల అనంతరం శివశంకర్ రెడ్డి బెయిల్, సునీత పిటీషన్లపై న్యాయస్థానం తదుపరి విచారణ ఏప్రిల్ 6కు వాయిదా వేసింది.కాగా వివేకా హత్య కేసులో సిబిఐ విచారణ కొనసాగుతోంది.
Must Read:-వివేకా హత్యకేసులో ఉమాశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేసిన కోర్టు