తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో టీడీపీ దూసుకుపోతుండటంతో ప్రత్యర్థులకు, ముఖ్యంగా వైసీపీకి వణుకు పుడుతోంది. వారికి అడ్డుకట్ట వేయడానికి రకరకాల కుయుక్తులు పన్నుతున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
వైరల్ అవుతున్న అచ్చెన్న వీడియో..
గత మూడు రోజుల నుండి ‘టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ బాగుంటే పార్టీ ఇలా ఎందుకు ఉంటది. 17 తరువాత పార్టీ లేదు, బొక్కా లేదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నట్లు’ ఒక వీడియో ఎలక్ట్రానిక్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఈ వీడియోలో నిజా నిజాలు, తర్వాత జరుగుతున్నపరిణామాలు పరిశీలిస్తే అందులో వాస్తవమెంతో అందరికి అవగతమవుతుంది.
వైసీపీ నాయకులు ముందే స్పందించడంతో..
తిరుపతి ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ దూకుడు తగ్గించేందుకు, పార్టీ శ్రేణులలో నైతిక స్థైర్యం దెబ్బతీసేందుకు, ప్రజల్లో తెలుగుదేశం పార్టీని బలహీనపరిచి తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో పార్టీని దెబ్బసేందుకే అచ్చెన్నాయుడు వీడియోను మార్ఫింగ్( వాయిస్) చేసి వైసీపీ వారు బయటికి వదిలారనే ఆరోపణలు ఉన్నాయి. అచ్చెన్నాయుడు అదే రోజు స్పందించి తన ట్విట్టర్ ద్వారా అది మార్ఫింగ్ వీడియో అని, తనకు, లోకేష్ ఉన్న బంధాన్ని ఎవరు విడతీయలేరని ట్వీట్ చేశారు. ఆ వీడియోపై తెలుగుదేశం పార్టీ, అచ్చెన్నాయుడు స్పందిచక ముందే… వైసీపీ నాయకులు మీడియా ముందుకు వచ్చి ఆ వీడియోతో తమకు సంబంధం లేదు అంటూ భుజాలు తడుముకునే ప్నయత్నం చేశారన్న విమర్శలున్నాయి. అంతేకాకుండా వారి శైలిలో ఆ వీడియో నిజం అని చెప్పే ప్రయత్నం చేశారంటున్నారు. వీటిని బట్టే అది వైసీపీ కుట్రగానే భావించాల్సి వస్తుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఈ ఎత్తుగడ ఫలిస్తుందా..?
పవర్ పాలిటిక్స్లో ఒక పార్టీ ఇంకొక పార్టీని ఆర్థికంగా దెబ్బతీయడం, రాజకీయంగా నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయడానికి ఎత్తుగడలు వేస్తూనే ఉంటాయి. ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం తిరుపతి ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేన- బీజేపీలు గెలుపు కోసం పోరాడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అధ్యకుడు చంద్రబాబు మొదలుకొని ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్త వరకు గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ శ్రమిస్తున్నారు. లోకేష్ ఇంటింటి ప్రచారం చేస్తూ, సభల్లో పంచ్ డైలాగ్లు వేస్తూ, సవాళ్ళు విసురుతూ, అధికార పార్టీ వైఫల్యాలను గట్టిగా ఎండగడుతున్నారు. చంద్రబాబు, లోకేష్ సభలకు ప్రజలు పెద్ద ఎత్తున రావడం, చంద్రబాబు తనదైన శైలిలో అధికార పార్టీ వైఫల్యాలపై విరుచుకపడడం, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుల ప్రచారంతో అక్కడ వైసీపీ విజయావకాశాలు సన్నగిల్లుతున్నాయని వారు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో టీడీపీని దెబ్బసేందుకే అచ్చెన్నాయుడు వీడియోను మార్ఫింగ్( వాయిస్) చేసి వైసీపీ వారు బయటికి వదిలారనే వాదన ఉంది. నిన్న అలిపిరిలో లోకేష్ ప్రమాణం సందర్భంగా అచ్చెన్నాయుడు పాల్గొని వారిద్దరూ సన్నిహితంగా మెలిగిన దానిని బట్టి ఆ వీడియోను ప్రజలెవరూ నమ్మే పరిస్థితులు కనిపించడం లేదు.
Must Read ;- రెచ్చగొట్టిందెవరో.. ఆకుల వెంకటేష్ ఎప్పుడూ రచ్చే..!