వైసీపీ నేతల బెదిరింపులకు బెదిరేది లేదని, సీఎం జగన్మోహన్రెడ్డికి బుద్ది చెప్పాల్సిన సమయం వచ్చిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. తిరుపతి లోక్సభ ఉపఎన్నికల ప్రచార సన్నాహాల్లో భాగంగా ఇవాళ తిరుపతిలోని ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ నేతలతో ఆయన సమావేశం అయ్యారు. వైసీపీ నాయకులు బెదిరింపులు, దౌర్జన్యాలు, మద్యం, డబ్బు పంచడం చేయకుండా ఏ ఎన్నికల్లోనయినా గెలిచారా అని సోము ప్రశ్నించారు. ఏపీలో వైసీపీని ఎదుర్కొనే దమ్ము ఒక్క బీజేపీకే ఉందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు.
తిరుపతిలో బీజేపీదే గెలుపు
ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతోందని, తిరుపతిలో కూడా అభివృద్ధి నినాదంతో ఉప ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తామని సోము వీర్రాజు ధీమా వ్యక్తం చేశారు. జనసేనతో కలసి తిరుపతిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. కొందరు ఉన్నతాధికారులు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని సోము మండిపడ్డారు. అలాంటి వారికి బీజేపీ తగిన సమయంలో బుద్ది చెబుతుందని సోము హెచ్చరించారు.
Also Read:- బీజేపీ వల్లే ఓడిపోయాం.. జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్