కేంద్ర ప్రభుత్వం తీసుకున్న దేశవ్యాప్త విధానంలో భాగంగానే విశాఖ స్టీల్ పరిశ్రమను ప్రైవేటీకరణ చేస్తున్నామని బీజేపీ సీనియర్ నేత సునీల్ దేవ్ధర్ స్పష్టం చేశారు. ఉక్కు పరిశ్రమ కార్మికులు, ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి బాధ్యత కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన విజయవాడ బీజేపీ కార్యాలయంలో అన్నారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో బీజేపీ పదాదికారుల సమావేశంలో సునీళ్ దేవ్ధర్ పాల్గొన్నారు. తిరుపతి ఉపఎన్నికపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
తిరుపతి అభ్యర్థి ఎవరు
తిరుపతి ఉప ఎన్నికల్లో ఎవరిని నిలపాలనే దానిపై నేతల అభిప్రాయాలను సేకరించారు. విశ్రాంత ఐఏఎస్ అధికారిని ఒకరిని పోటీలో నిలిపే అంశంపై కూడా చర్చించారు. ఉప ఎన్నికల ప్రకటన విడుదల అయినాక అభ్యర్థిని ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో అందరి అభిప్రాయాలను సేకరిస్తామని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించారు. ఏపీ బీజేపీ నాయకులు అవసరమైనప్పుడల్లా కేంద్రం వద్దకు వెళ్లి సమస్యను వివరిస్తామని ఆయన తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశాన్ని కొన్ని పార్టీలు కావాలనే రాజకీయాలకు వాడుకుంటున్నాయని మాధవ్ అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంటు ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన పని లేదని వారిని కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Must Read ;- ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్దికోసమే ఉక్కుకు కేటీఆర్ మద్దతు డ్రామా : రేవంత్