“ఏ దేశమేగినా ఎందు కాలెడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని..” అన్న మాటలను స్ఫూర్తిగా తీసుకుని మునుపెన్నడూ లేని విధంగా జర్మనీ దేశం నందు ఫ్రాంక్ఫర్ట్ (Frankfurt) నగరంలో మినీ మహానాడు ఘనంగా జరుగబోతోంది. 2018 నుంచి జర్మనీ దేశం లో ప్రతి సంవత్సరం మహానాడు ను తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒక పండుగ లా చేసుకుంటారు . గడిచిన రెండు సంవత్సరాలు గా కరోనా మహమ్మారి వల్ల ఆన్లైన్ పద్ధతి లో జరుపుకున్నారు . కానీ ఈసారి పెద్ద ఎత్తున్న సంబరాలు జరగాలి అని తెలుగుదేశం పార్టీ సిటీ కౌన్సిల్స్ మరియు తెలుగుదేశం పార్టీ అభిమానులు నిర్ణయించారు . ఏ కౌరవ సభలో అయితే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడికి అవమానం జరిగిందో అదే అధ్యక్షున్ని గౌరవంగా ముఖ్యమంత్రి స్థానం లో ఆ సభకి పంపడానికి కృషి చేస్తున్నాం అని తెలుగుదేశం పార్టీ జర్మనీ సభ్యలు పేర్కొన్నారు .ఈ మహానాడు లో కొంత మంది ముఖ్యమైన రాష్ట్ర నాయకులని జూమ్ మీటింగ్ ద్వారా ఆహ్వానించాం అని వాళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ జర్మని కార్యకర్త లలో స్ఫూర్తి ని నింపే సందేశాలు ఇప్పిస్తాం అని తెలుగుదేశం పార్టీ సిటీ కౌన్సిల్స్ పేర్కొన్నారు.
ఈ సమావేశం లో తెలుగుదేశం పార్టీ ముఖ్య సభ్యులు వెంకట్ కాండ్ర , శ్రీకాంత్ కుడితి , నరేష్ కోనేరు , పవన్ కుర్రా , సుమంత్ కొర్రపాటి , అనిల్ మిక్కిలినేని , టిట్టు మద్దిపట్ల , శివ , వంశి దాసరి , మరియు మొదలగు సభ్యులు పాల్గొన్నారు .